దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత

  • IndiaGlitz, [Thursday,August 06 2020]

టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రాత్రి ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఆయనను గచ్చిబౌలిలోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 2:15 గంటలకు తుదిశ్వాస విడిచారు.

దుబ్బాక మండలం చిట్టాపూర్‌కి చెందిన రామలింగారెడ్డి దాదాపు పాతికేళ్ల పాటు జర్నలిస్టుగా పని చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డి కీలక పాత్ర పోషించారు. 2004లో ఆయన తొలి సారిగా రాజకీయ రంగ ప్రవేశం చేయడమే కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2008, 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. రామలింగారెడ్డికి భార్య, కూమారుడు, కుమార్తె ఉన్నారు. రామలింగారెడ్డి మృతితో ఆయన నియోజకవర్గం విషాదంలో మునిగిపోయింది.

More News

సుశాంత్ సీబీకి.. ధృవీకరించిన సీబీఐ అధికార ప్రతినిధి

బాలీవుడ్ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

‘జీ 5’లో జ్యోతిక, కార్తీ నటించిన ‘దొంగ’ వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ స్పెషల్‌ సినిమాను ‘జీ 5’ ఒటీటీ తెలుగు ప్రజల ముందుకు తీసుకొస్తోంది.

భారత్‌లో కరోనా.. డిశ్చార్జ్‌లలో ఇదే రికార్డ్..

భారత్‌లో రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే విశేషం ఏంటంటే..

'రాధాకృష్ణ' ఫస్ట్ లుక్ విడుదల

‘టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా, య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది, బొమ్మ‌న బ్రద‌ర్స్ చంద‌న సిస్ట‌ర్స్ , ఢ‌మ‌రుకం’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో పాటు రీసెంట్‌గా

మ‌హేశ్‌కు సెకండ్ హీరోయిన్ దొరికిన‌ట్టేనా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్.. లాక్‌డౌన్ పుణ్య‌మాని ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఖాళీ స‌మ‌యాన్నంతా గౌత‌మ్‌, సితార‌తో ఎంజాయ్ చేస్తున్నారు.