close
Choose your channels

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత

Thursday, August 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రాత్రి ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఆయనను గచ్చిబౌలిలోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 2:15 గంటలకు తుదిశ్వాస విడిచారు.

దుబ్బాక మండలం చిట్టాపూర్‌కి చెందిన రామలింగారెడ్డి దాదాపు పాతికేళ్ల పాటు జర్నలిస్టుగా పని చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డి కీలక పాత్ర పోషించారు. 2004లో ఆయన తొలి సారిగా రాజకీయ రంగ ప్రవేశం చేయడమే కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2008, 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. రామలింగారెడ్డికి భార్య, కూమారుడు, కుమార్తె ఉన్నారు. రామలింగారెడ్డి మృతితో ఆయన నియోజకవర్గం విషాదంలో మునిగిపోయింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.