డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అక్టోబర్ లో జీవా, కాజల్ చిత్రం

  • IndiaGlitz, [Monday,September 19 2016]

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ 'కవలై వేండాం'. డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం తెలుగు హక్కులను కోసం చాలా మంది పోటీ పడ్డప్పటికీ డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ ఫ్యాన్సీ ఆఫర్ తో హక్కులను దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా....

డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ "రంగం చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోగా నటించిన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అంటేనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు చాలా బావుంది. మంచి స్పందన వచ్చింది. దాంతో తెలుగులో సినిమాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నాను. త్వరలోనే తెలుగు టైటిల్ ను అనౌన్స్ చేస్తాం. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తెలుగు, తమిళంలో అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

జీవా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డీకే.

More News

క‌త్రినాకు వ‌ర్మ స‌పోర్ట్‌....

బాలీవుడ్ అగ్ర‌తార క‌త్రినా కైఫ్‌కు స్మితాపాటిల్ అవార్డును ప్ర‌క‌టించిన సంగ‌తి విదిత‌మే. అయితే దీనిపై అసంతృప్తితో ఉన్న కొంత మంది నెటిజ‌న్లు క్ర‌తినాపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే క‌త్రినాపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు రాంగోపాల్ వ‌ర్మ రీ కౌంట‌ర్ ఇవ్వ‌డం పెద్ద షాక్ అయ్యింది.

త‌మ్ముడి నిర్మాత‌ల‌తో అన్న‌

కార్తీ హీరోగా గోకుల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కాష్మోరా. ఈ సినిమాను నిర్మిస్తున్న డ్రీమ్ వారియ‌ర్స్ బ్యాన‌ర్స్ అధినేత ఎస్‌.ఆర్‌.ప్ర‌భు ఇప్పుడు కార్తీ అన్న‌య్య సూర్య‌తో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

ల‌ఢ‌ఖ్‌లో కార్తీ సినిమా షూటింగ్‌

ఓకే క‌న్మ‌ణి చిత్రాన్ని ఓకే బంగారం పేరుతో తెలుగులో దిల్‌రాజు విడుద‌ల చేశారు. సినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌కత్వంలో కార్తీ, అదితిరావు జంట‌గా రూపొందుతోన్న చిత్రం  కాట్రు వెలియ‌డు.

సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగిన జాగ్వార్ ఆడియో ఆవిష్కరణోత్సవం

మాజీ ప్రధాని దేవగౌడ మనవడు,కర్నాటక మాజీ ముఖ్యమంత్రి,కన్నడంలో అనేక సూపర్హిట్ చిత్రాలు నిర్మించిన హెచ్.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన భారీ చిత్రం జాగ్వార్.

నవరస నట తిలకం మంచు మోహన్ బాబు 40 ఏళ్ల సుదీర్ఘ నటప్రస్ధానంకు ఘన సన్మానం

ప్రతి నాయకుడుగా,కదానాయకుడుగా,నిర్మాతగా,విద్యావేత్తగా,రాజకీయ నాయకుడుగా...ఇలా తను ప్రవేశించిన ప్రతి శాఖలో విశేష గుర్తింపు ఏర్పరుచుకున్న సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు.