close
Choose your channels

ల‌ఢ‌ఖ్‌లో కార్తీ సినిమా షూటింగ్‌

Monday, September 19, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఓకే క‌న్మ‌ణి చిత్రాన్ని ఓకే బంగారం పేరుతో తెలుగులో దిల్‌రాజు విడుద‌ల చేశారు. సినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌కత్వంలో కార్తీ, అదితిరావు జంట‌గా రూపొందుతోన్న చిత్రం కాట్రు వెలియ‌డు. ఈ చిత్రం ప్ర‌స్తుతం యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. పీకే, 3 ఇడియ‌ట్స్, స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్‌ చిత్రాల‌కు వ‌ర్క్ చేసిన శ్యామ్ కౌశ‌ల్ ఈ చిత్రానికి స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు.

అక్టోబ‌ర్ నెల ముగిసే లోపు ల‌ఢ‌క్‌, కాశ్మీర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మ‌రికొన్ని యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రించాల‌నుకుంటున్నార‌ట‌. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి విడుద‌ల చేయాల‌ని మ‌ణిర‌త్నం ఆలోచ‌న‌. దిల్‌రాజు తెలుగు వెర్ష‌న్ లో సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.