close
Choose your channels

పోసానికి షాకిచ్చిన ఎన్నికల కమిషన్

Thursday, March 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పోసానికి షాకిచ్చిన ఎన్నికల కమిషన్

టాలీవుడ్ సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళికి ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఇటీవల ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన టీడీపీ సర్కార్, సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా కమ్మ కులం అంటూ తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకం రేపాయి. దీంతో పలువురు ఈ విషయాలను పూసగుచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.

ఈ సందర్భంగా పోసానికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తక్షణమే తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. దీనికి స్పందించిన ఆయన.. చంద్రబాబుపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఈసీకి తిరిగి లేఖ రాశారు. అంతేకాదు తాను నడవలేని స్థితిలో, సర్జరీ కోసమై హైదరాబాద్ నగరంలోని యశోదా ఆస్పత్రిలో చేరినట్లు లేఖలో తెలిపారు.

కాగా.. నిన్నటి దాకా బాగున్న పోసానికి ఇంత సడన్‌గా ఏమైంది..? ఈసీ దగ్గరికెళితే ఈయన పరిస్థితేంటి..? ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి వివరణ ఇచ్చుకోబోతున్నారు..? ఈసీ ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.