Etala, Revanth:గజ్వేల్‌లో ఈటల.. కామారెడ్డిలో రేవంత్.. కేసీఆర్‌పై పోటీకి సై..!

  • IndiaGlitz, [Thursday,October 26 2023]

ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢీ అంటే ఢీ అనేలా పోరాడుతున్నారు. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా విపక్షాలు పోరాటం చేస్తున్నాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌పై పోటీకి కీలక నేతలను రంగంలోకి దింపుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తొలిసారిగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. తన కంచుకోట గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీకి దిగారు. దీనిపై ప్రతిపక్షాలు సెటైర్లు కూడా వేశాయి. గజ్వేల్‌లో భయంతోనే కామారెడ్డి నుంచి కూడా పోటీకి దిగారని విమర్శలు చేశాయి.

ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గులాబీ బాస్‌పై పోటీకి కాలుదువ్వారు. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్, ఈటల కలిసి పనిచేశారు. అయితే 2021లో ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆయన బీజేపీలో చేరారు. అప్పటి నుంచి కేసీఆర్‌పై ఈటల తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. బీసీల్లో ఈటలకు మంచి గుర్తింపు ఉంది. దీంతో కేసీఆర్‌పై ఈటల పోటీకి నిలపాలని భావించిన కమలం పెద్దలు ఆయన పేరును ప్రకటించారు. దాంతో గజ్వేల్‌లో ఈసారి ఎన్నికల పోరు హోరాహోరీగా ఉండనుంది.

ఇక కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించాలనే పట్టుదలంతో కాంగ్రెస్ ఉంది. అందుకే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీకి పెట్టాలని యోచిస్తోంది. ఇందుకు రేవంత్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. తనను జైలులో పెట్టడంతో కేసీఆర్‌పై రేవంత్ ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ను అధికారం నుంచి దూరం చేయాలని పోరాడుతున్నారు. అవకాశం వస్తే కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్‌ను గద్దె దించాలనే పట్టుదలతో ఉన్నారు.

తెలంగాణలో కేసీఆర్ తర్వాత బలమైన ప్రజాభిమానం ఉన్న నేతలుగా ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డిలకు పేరుంది. ప్రజల్లో కూడా వారికి మాస్ లీడర్లుగా మంచి క్రేజ్ ఉంది. దీంతో ఇద్దరు నేతలు కేసీఆర్‌పై పోటీకి దిగనుండడంతో ఈసారి ఎన్నికల పోరు యుద్ధాన్ని తలపించనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

More News

Chiru, Maheshbbau:వెంకటేశ్ రెండో కుమార్తె నిశ్చితార్థం వేడుకలో చిరు, మహేశ్‌ సందడి

టాలీవుడ్‌ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేశ్‌ వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు.

DK Aruna:కాంగ్రెస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు.. పార్టీ మార్పుపై తేల్చి చెప్పిన డీకే అరుణ..

తాను పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు.

Anchor Suma:మీడియాకు క్షమాపణలు చెప్పిన యాంకర్ సుమ.. ఎందుకంటే..?

ప్రముఖ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ జరిగిన ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉంటారు.

Sharmila:షర్మిల సంచలన నిర్ణయం.. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరం..

తెలంగాణ ఎన్నికల వేళ వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.

బాలయ్య ఖాతాలో మరో రూ.100కోట్లు సినిమా.. దసరా విన్నర్‌గా 'భగవంత్ కేసరి'

నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది దసరా విన్నర్‌గా నిలిచారు. ఆయన నటించిన 'భగవంత్ కేసరి'(Bhagavanth Kesari) మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.