నన్ను చూసి అంతా షాకవుతారు: సమంత

  • IndiaGlitz, [Monday,November 16 2020]

అక్కినేని వారి కోడలు సమంత డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతోంది. వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సామ్ పలు వైవిధ్యమైన రోల్స్‌లో నటించి అలరించింది. ఇప్పుడు మరింత వైవిధ్యమైన పాత్ర ఇప్పటి వరకూ ఆమె కెరీర్‌లోనే నటించనటువంటి ఓ ఆసక్తికర పాత్రలో సామ్ నటించనుంది. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి డిజిటల్ కంటెంట్‌కు ప్రాధాన్యత విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో స్టార్స్ అంతా డిజిటల్ బాట పడుతున్నారు.

ఈ క్రమంలోనే సమంత కూడా వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్ధమవుతోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్‌తో సామ్ డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. వచ్చే నెలలో రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండో సీజన్‌లో సామ్ నటించనుంది. దీనికి సంబంధించిన విశేషాలను సామ్ ఓ ఆంగ్ల మీడియాతో పంచుకుంది. ఈ వెబ్ సిరీస్‌లో తీవ్రవాదిగా సామ్ కనిపించనుంది. తమకు రూల్స్ బ్రేక్ చేసే అవకాశాన్ని ఓటీటీ కల్పించిందని.. 'ఫ్యామిలీ మేన్-2'లో సరికొత్తగా కనిపించబోతున్నానని.. తనను చూసి అంతా షాక్ అవుతారని సామ్ తెలిపింది.

More News

కరోనా వ్యాక్సిన్‌ గురించి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

మార్చి ముందు వరకు ప్రపంచంలో మనిషి చాలా స్వేచ్ఛగా తిరిగాడు. కానీ.. మార్చి నుండి పరిస్థితి మారిపోయింది.

నేడు సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం.. మంత్రి పదవులపై ఆసక్తి..

బిహార్ నూతన ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరోసారి బాలయ్య అతిథి పాత్ర చేస్తారా?

నటసింహ నందమూరి బాలకృష్ణ గెస్ట్‌ రోల్స్‌లో నటిస్తారా? అంటే ఎందుకు నటించరని ఆయన అభిమానులు ఎదురు ప్రశ్నిస్తారు.

గుడిలో దేవుడి ముందు మోకరిల్లి అలాగే ప్రాణాలొదిలిన మాజీ ఎమ్మెల్యే..

ఆయనో మాజీ ఎమ్మెల్యే.. ధన్‌తేరాస్ సందర్భంగా ఆలయానికి వెళ్లి పూజ చేస్తూ దేవుడికి శిరస్సు వంచి ప్రణామం చేసి అలాగే కిందపడిపోయారు.

23 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్: కేసీఆర్

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 23 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.