close
Choose your channels

గుడిలో దేవుడి ముందు మోకరిల్లి అలాగే ప్రాణాలొదిలిన మాజీ ఎమ్మెల్యే..

Monday, November 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆయనో మాజీ ఎమ్మెల్యే.. ధన్‌తేరాస్ సందర్భంగా ఆలయానికి వెళ్లి పూజ చేస్తూ దేవుడికి శిరస్సు వంచి ప్రణామం చేసి అలాగే కిందపడిపోయారు. అంతే సెకన్లలో ప్రాణం గాల్లో కలిసి పోయింది. ఈ దృశ్యాలన్నీ ఆలయంలోని సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లో చోటుచేసుకుంది. బైతూల్ మాజీ ఎమెల్యే, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ కోశాధికారి వినోదా డాగా థన్‌తే‌రస్ సందర్భంగా దాదావాడీలోని ఆలయంలో పూజ చేసేందుకు వెళ్లారు.

ముందుగా ఆయన ఆలయంలోని పార్శ్వనాథునికి పూజలు నిర్వహించిన అనంతరం... దాదా గురుదేవ్ మందిరంలో ప్రదక్షిణలు చేసి, పూజ నిర్వహించారు. ఈ తరువాత దాదా గురుదేవ్ పాదాలకు మోకరిల్లారు. అంతే వెంటనే అలాగే కిందకు పడిపోయారు. సెకన్లలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మొత్తం సీసీ టీవీలో రికార్డ్ అయింది. వినోద్ డాగా ప్రాణాలు కోల్పోయిన కాసేపటికి ఆ ఒక బాలుడు మందిరంలోకి వచ్చాడు. ఎమ్మెల్యే కిందపడి ఉండటాన్ని గమనించి పూజారికి విషయాన్ని వెల్లడించాడు.

హుటాహుటిన పూజారితోపాటు అక్కడున్న వారంతా ఆలయంలోకి వెళ్లి వినోద్ డాగాను లేపే ప్రయత్నం చేశారు. ఆయనలో చలనం లేకపోవడంతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వినోద్ డాగాను పరీక్షించి అప్పటికే మృతి చెందారని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆలయంలో రికార్డ్ అయిన సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన మరణవార్త తెలుసుకుని పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.