ఏపీలో ఫ్యామిలీ పాలిటిక్స్కు ఇక సెలవు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్లో ఫ్యామిలీ పాలిటిక్స్కు ఫుల్స్టాప్ పడింది. కొన్ని తరాలు పాటు రాజకీయాల్లో కాకలు తీరిన నేతలు 2019 ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారు. తమకు అడ్డు లేదు.. తాము చెప్పిందే వేదం.. మేం చెప్పినట్లే చేసి తీరాలి ఈ కుటుంబాలు నియోజకవర్గాలను, జిల్లాలను కంట్రోల్లో పెట్టుకుని ఓ ఆట ఆడించేవారు.
అలాంటి వారందరూ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయారు. బహుశా ఇక దెబ్బకు ఇక కోలుకుని మళ్లీ పోటీ చేయాలన్నా సాహసించరేమో. ఇదిలా ఉంటే కొన్ని కొన్ని చోట్ల ఇక మనమెందుకులే అని వారి వారసులను రంగంలోకి దింపారు. ఫస్ట్ టైమ్ రంగంలోకి దింపగా వారంతా ఫ్యాన్ గాలికి తట్టుకోలేక వెనుదిరిగారు.
ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయిన కుటుంబాలివే..!
రెడ్డప్పగారి ఫ్యామిలీ (రాయచోటి, లక్కిరెడ్డి పల్లె), జేసీ ఫ్యామిలీ (అనంతపురం), పరిటాల ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ, కోట్లా ఫ్యామిలీ, కేఈ ఫ్యామిలీ, టీజీ ఫ్యామిలీ, అశోక్ గజపతిరాజు ఫ్యామిలీ, దేవినేని ఫ్యామిలీ, వంగవీటి ఫ్యామిలీ, మాగంటి ఫ్యామిలీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాతాడంత లిస్ట్ ఉండనే ఉంది. ఈ కుటుంబాలన్నీ ఒకప్పుడు ఆయా నియోజకవర్గాల్లో.. జిల్లా్ల్లో ఓ వెలుగు వెలిగిన వారే.. మరికొందరు 2019 ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దింపి ప్లాప్ అయ్యారు.
గెలిచిందెవరు..?
శ్రీకాకుళం టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు వరుసగా రెండోసారి విజయం సాధించారు. మరోవైపు.. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కూడా ఈ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగురవేశాడు. శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేసిన ఈయన వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్పై 6,653 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.