సాయితేజ్ సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్

  • IndiaGlitz, [Friday,July 31 2020]

గత ఏడాది విడుద‌లైన ‘చిత్రలహరి, ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు సుప్రీమ్ హీరో సాయితేజ్. ఇప్పుడు ఈ మెగాక్యాంప్ హీరో నటించిన యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'సోలో బ్రతుకే సో బెటర్’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. నిజానిక క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’ మూవీ మే 1కే విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా వ‌ల్ల సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. థియేట‌ర్స్ ఓపెన్ అయితే కానీ.. ఈ సినిమా విడుద‌లపై ఓ క్లారిటీ రానుంది. అయితే లాక్‌డౌన్ స‌మ‌యంలో కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీ బాట‌ప‌ట్టాయి. మ‌రికొన్ని సినిమాల‌కు ఓటీటీల నుండి ఫ్యాన్సీ ఆఫ‌ర్ వ‌చ్చినా వ‌ద్ద‌నుకుని థియేట‌ర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయా? అని ఎదురుచూస్తున్నాయి.

ఇప్పుడు అలాంటి ఓ ఫ్యాన్సీ ఆఫ‌ర్ సాయితేజ ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’ మూవీకి వ‌చ్చిందట‌. ఓ ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ రూ.25 కోట్లు కోట్ చేసింద‌ట‌. మ‌రి సాయితేజ్ నిర్మాత‌లు ఈ ఆఫ‌ర్‌కు ఓకే అంటారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్ర‌స్తుతం దేవాక‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో సాయితేజ్ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ఇదొక పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

More News

అందుకు నో చెప్పిన బొమ్మాళీ!!

బొమ్మాళీ అంటే మ‌న‌కు చ‌టుక్కున గుర్తుకొచ్చేది అనుష్క శెట్టి. అప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌లు చేస్తూ వ‌చ్చిన ఈ బెంగళూరు బ్యూటీ అరుంధతి

నిఖిల్ 20 ఖ‌రారు!!

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ వ‌రుస సినిమాల‌ను అనౌన్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో  #AA21

అల వైకుంఠపురం లో వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తో  సరి కొత్త ఇండస్ట్రీ రికార్డ్స్ నెలకొల్పి, అదే ఉత్సహంతో వరుస సినిమాలుతో తన అభిమానులని అలరించడానికి సిద్ధం అవుతున్నారు

9 మందిని పొట్టనబెట్టుకున్న శానిటైజర్..

ఏపీలో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి.

తాత గొప్ప‌త‌నం ఈరోజు ఇంకా బాగా తెలుస్తుంది:  అల్లు అర్జున్‌

ఈరోజు సీనియ‌ర్ క‌మెడియ‌న్‌, దివంగ‌త అల్లు రామ‌లింగ‌య్య వ‌ర్ధంతి. ఆయ‌న 16 వ‌ర్ధంతి నేడు. సినీ ప్రియులు, ఆయన కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌కు నివాళులు అర్పిస్తున్నారు.