close
Choose your channels

బొల్లారంలోని వింద్య ఆర్గానిక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం..

Saturday, December 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారంలో వింద్య ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో పెద్ద శబ్దాలతో కంపెనీలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 120 మంది కార్మికులున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలవగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యాక్టరీలో ఇంకెవరైనా ఉన్నారా? అంతా బయటకు వచ్చేశారా? అనేది తెలియ రాలేదు.

క్షతగాత్రులను అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే మంటలు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వింద్య ఆర్గానిక్స్ వద్దకు చేరుకుని ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారనే విషయమై ఆరా తీస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.