ఆది పుట్టినరోజు 23న 'గ‌రమ్' ఆడియో

  • IndiaGlitz, [Saturday,December 19 2015]

లవ్లీ రాక్ స్టార్ ఆది హీరోగా, మదన్ దర్శకత్వంలో శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై పి.సురేఖ నిర్మించిన చిత్రం 'గరం'. ఇందులో అదా శర్మ కథానాయికగా నటించింది. ఈ నెల 23న ఆది బర్త్ డే. ఈ సందర్భంగా 'గరం' ఆడియో ఆవిష్కరణ వేడక జరగనుంది. అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకలో పలువురు సినీ రంగ ప్రముఖులు పాల్గొననున్నారు. 'పెళ్లైన కొత్తలో' ఫేం అగస్త్య ఈ చిత్రానికి స్వరాలందించారు.

ఈ సందర్భగా పి. సురేఖ మాట్లాడుతూ - ''కథాబలం ఉన్న ఈ చిత్రంలో పాటలకు స్కోప్ ఉంది. అగస్త్య అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. మంచి మ్యూజికల్ హిట్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్, కామెడీ.. ఇలా అన్ని అంశాలూ ఉన్న మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. ఇటీవల ప్రభాస్ విడుదల చేసిన ఈ చిత్రం మొదటి టీజర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందుతాయనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

మదన్ మాట్లాడుతూ - ''ద్వేషించే వారిని ప్రేమించే స్థాయికి ఎదగడం చాలా కష్టం. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ చిత్రం చేశాం. శ్రీనివాస్ చెప్పిన ఈ కథ నచ్చి, సినిమా చేశాం. ఇప్పటివరకూ చేసిన చిత్రాల ద్వారా తనలో మంచి నటుడు ఉన్నాడని ఆది నిరూపించుకున్నాడు. ఈ చిత్రం నటుడిగా తనకు మరింత పేరు తెచ్చిపెడుతుంది. పాత్రను ప్రేమించి చేశాడు'' అని తెలిపారు.

ఆది మాట్లాడుతూ - ''స్ర్కీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ ఇచ్చిన కథను మదన్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. అగస్త్య మంచి పాటలిచ్చారు'' అన్నారు.

ఈ చిత్రానికి కథ, మాటలు - శ్రీనివాస్ గవిరెడ్డి, కెమెరా - సురేందర్ రెడ్డి.టి, సంగీతం - ఆగస్త్య, కళ - నాగేంద్ర, ఎడిటింగ్ - కార్తీక్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - బాబ్జీ, కో-డైరెక్టర్ - అనిల్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - మదన్.

More News

బాల‌య్య‌తో ఎన్టీఆర్ గొడ‌వ స‌మ‌సిపోనుందా...

గ‌త కొన్ని బాబాయ్ బాల‌య్య‌, అబ్బాయి ఎన్టీఆర్‌ల మ‌ధ్య సైలెంట్ వార్ న‌డుస్తుంది. ఇది కాద‌న‌లేని విష‌యం.

తమిళ రీమేక్ ప్లాన్ లో నితిన్

తమిళ రీమేక్ ప్లాన్ లో ఉన్న యువ హీరో... ఎవరో కాదు క్యూట్ హీరో నితిన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ అ ఆ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అభిమానులకు పవన్ కానుక....

పవర్ స్టార్ పవన్కళ్యాణ్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. సినిమాను స్మమ్మర్ లో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.

రాజస్ధాన్ లో తేజు, రాశి..

రాజస్ధాన్ లో తేజు, రాశి ఖన్నా... ఏం చేస్తున్నారనుకుంటున్నారా..? సుప్రీమ్ సినిమా కోసం సాంగ్ షూట్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ రావివూడి తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విక్రమ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ మారింది....

చియాన్ విక్రమ్ హీరోగా మర్మ మణిదన్ అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముందు నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తారని వార్తలు వినపడ్డాయి.