ఉదయానిథి స్టాలిన్ - నయన తారల 'గుడ్ ఈవెనింగ్'

  • IndiaGlitz, [Wednesday,March 02 2016]

తమిళంలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న "నంబేండా" చిత్రాన్ని తెలుగులో "గుడ్ ఈవెనింగ్" పేరుతో డబ్ చేశారు భద్రా కాళీ ఫిలిమ్స్ వారు. తమిళంలో టాప్ స్టార్స్ గా వెలుగుతోన్న ఉదయానిథి స్టాలిన్, నయన తార , సంతానంల కాంబినేషన్ లో ఏ.జగదీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి హేరీష్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలుస్తోంది.

చిత్ర కథాంశానికి వస్తే, నయనతారను లైన్లో పెట్టేందుకు అష్టకష్టాలు పడతాడు హీరో. చివరకు ఆమెని మెప్పించి ఒప్పిస్తాడు. అప్పుడు నయనతార తాను పదిరోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించానంటూ తన ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ విన్న హీరో రియాక్షన్ ఏంటి? ఆ ఫ్లాష్ బ్యాక్ లో దాగిఉన్న భయంకరమైన నిజాలు ఏంటి? చివరకు హీరోయిన్ ప్రేమను గెలిచేందుకు హీరో చేసిన సాహసం ఏమిటీ అన్నదే "గుడ్ ఈవెనింగ్"కథాంశం...

ఇందులో హీరో హీరోయిన్ల ప్రేమను సక్సెస్ చేసేందుకు సంతానం, పడే పాట్లు చేసే ఫీట్లు....కడుపుబ్బా నవ్విస్తాయి. కామెడీ, లవ్ , యాక్షన్ అనే మూడు ఎలిమెంట్స్ తో తమిళంలో సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రాన్ని, త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం, చాలా ఆనందంగా, గర్వంగా ఉంది.. మార్చ్ 2 వ వారంలో హైదరాబాద్ లో ఘనంగా ఆడియో వేడుక నిర్వహించి, 3 వ వారంలో సినిమాని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు భద్రకాళి ఫిలిమ్స్ అధినేత ప్రసాద్.

More News

ఎలాంటి పాత్ర చేయ‌డానికైనా నేను రెడీ - రేష్మి

జ‌బ‌ర్థ‌స్త్ పొగ్రామ్ తో బాగా పాపుల‌ర్ అయిన యాంక‌ర్ రేష్మి. ఇప్పుడు హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతూ రేష్మి న‌టించిన చిత్రం గుంటూరు టాకీస్.

నిజంగానే డిఫ‌రెంట్ మూవీ శౌర్య - మ‌నోజ్

మంచు మ‌నోజ్ - రెజీనా జంట‌గా ద‌శ‌ర‌థ్ తెర‌కెక్కించిన చిత్రం శౌర్య‌. ఈ చిత్రాన్ని సుర‌క్ష ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శివ‌కుమార్ నిర్మించారు. థ్రిల్లింగ్ ల‌వ్ స్టోరీగా రూపొందిన శౌర్య ఈనెల  4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

బొలివియాకు బన్ని...

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రం 'సరైనోడు'.

'బాహుబలి2' రిలీజ్ డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళిల ప్రెస్టిజియస్ మూవీ బాహుబలి ది బిగినింగ్ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే.

చైతు టైటిల్ చాలా ఇష్టం అంటున్ననాగ్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ఊపిరి. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.