సెప్టెంబర్ లో 'గుంటూర్ టాకీస్'

  • IndiaGlitz, [Thursday,August 13 2015]

నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం గుంటూర్‌ టాకీస్‌' ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, నరేష్‌ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌.ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల గుంటూరులో విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి ఆడియెన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా...

దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ చందమామ కథలు సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇది. నేషనల్‌ అవార్డ్‌ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో నాపై బాధ్యత పెరిగింది. నా గత చిత్రంలో సామాజిక స్పృహ అనే అంశం ఎలాగైతే మిళితమై ఉన్నదో అలాగే ఈ సినిమా సామాజిక స్పృహతో పాటు సినిమా అవుటండ్‌ అవుట్‌ కామెడితో ఫాస్ట్‌ పేజ్‌లో ఉంటుంది. ఈ సినిమాలో శ్రద్ధాదాస్‌ రివాల్వర్‌ రాణి అనే పాత్రలో నటించింది. బందిపోటు రాణిలా ఉండే శ్రద్ధాదాస్‌ పాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఆ రివాల్వర్ రాణి పాత్రకు సంబంధించిన పోస్టర్స్ ను విడుద చేస్తున్నాం. ఈ పాత్రతో శ్రద్ధాదాస్‌కి మంచి బ్రేక్‌ వస్తుంది. శ్రద్ధాదాస్‌తో సహా సిద్ధు, రేష్మీ, నరేష్‌గారు, రఘుబాబుగారు ఈ సినిమాలో కనపడే ప్రతి పాత్ర డిఫరెంట్‌గా ఉంటూ ప్రేక్షకుకు థ్రిల్లింగ్‌తో పాటు ఎంటర్‌టైనింగ్‌ను కలిగించేలా ఉంటాయి. సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం సినిమా ఫైనల్‌ మిక్సింగ్‌ దశలో ఉంది. శ్రీచరణ్‌ మంచి ఆల్బమ్‌ను అందించాడు. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా చక్కగా కుదిరింది. త్వరలోనే ఆడియో విడుద చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నిర్మాత రాజ్‌ కుమార్‌గారు సినిమాని ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్‌ సహా అన్నీ కార్యక్రమాను పూర్తి చేసి సినిమాని సెప్టెంబర్‌లో ప్రేక్షకు ముందుకు తీసుకురావడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌: ధరేంద్ర కాకరాల, సినిమాటోగ్రఫీ: రామిరెడ్డి.పి, మ్యూజిక్‌: శ్రీచరణ్‌ పాకా, నిర్మాత: రాజ్‌కుమార్‌.ఎం, రచన'దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తార్‌.

More News

'పులి' ట్రైలర్ డేట్

కత్తి’ చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్‌ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్‌ లేటెస్ట్ గా శింబుదేవన్‌

ప్రభాస్ కూడా స్టార్ట్ చేశాడు

ఇప్పటి వరకు చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు వీరందరూ సినిమాలతో పాటు దక్షిణాదిన

హైదరాబాద్ లో చరణ్ సినిమా

విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పైశ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం

షూటింగ్‌ పూర్తి చేసుకున్న కమల్‌హాసన్‌ 'చీకటిరాజ్యం'

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ హీరోగా త్రిష హీరోయిన్‌గా రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రాజేష్‌ ఎం. స్వెలని దర్శకునిగా పరిచయంచేస్తూ ఎన్‌. చంద్రహాసన్‌ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘చీకటిరాజ్యం’.

నాయకి షూటింగ్ లో త్రిష బిజీ

చెన్నై సొగసరి త్రిష తొలిసారి నాయకి టైటిల్ తో హర్రర్ కామెడి చిత్రంలో నటిస్తోంది.