బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలకు జీవీఎల్ వార్నింగ్!

  • IndiaGlitz, [Saturday,June 22 2019]

టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో చాలా వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే కావడం గమనార్హం. ఇప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేష్‌లపై అవినీతి ఆరోపణలు, బ్యాంకుల నుంచి తీసుకున్న కోట్ల నగదు తిరిగి చెల్లించకపోవడంతో ఆయా బ్యాంకుల ఫిర్యాదు మేరకు.. వారి ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ, ఈడీ దాడులు సైతం చేసింది. అప్పట్లో ఈ సోదాలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. అంతేకాదు బీజేపీ కక్షగట్టి మరీ ఇలా చేస్తోందని తెలుగు తమ్ముళ్లు నానా రచ్చకూడా చేశారు. మరికొన్ని రోజుల్లో మరోసారి దాడులు జరిగే అవకాశముందని అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు గనుక దాడులు ఇక ఉండని సోషల్ మీడియా వేదికగా.. పలువురు నేతలు సైతం బాహటంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎవరైనా ఎదుర్కోవాల్సిందే..!

అయితే తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ కీలకనేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు స్పందించారు. బీజేపీలో చేరిన నేతలు ఎవరైనా సరే వారిపై అవినీతి ఆరోపణలుంటే తప్పక
అభియోగాలు ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పారు. శనివారం నాడు గుంటూరులో మీడియా మీట్ నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీలో చేరాలన్న అవినీతి ఆరోపణలున్న నేతలు కాస్త జంకుతున్నారు. అంతేకాదు ఇప్పుడు టీడీపీలో చేరిన ఎంపీలు సైతం ఒకింత జంకుతున్నప్పటికీ.. అవన్నీ మాటలకే పరిమితమవుతాయని అనుకుంటున్నారట.

రైతులకు త్వరలో ఫించన్...

ఐదేళ్ళలో మేం చేసిన అభివృద్ధే మరోసారి అధికారం కట్టబెట్టారు. గత 60 ఏళ్ళ జరగని అభివృద్ధిని మోదీ చేసి చూపించారు.

అందరి అంచనాలకు పటాపంచలు చేస్తూ మోడి అత్యధిక మెజారిటీ సాగించారు.

ఏపిలో గత ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో నడిచింది.

కేవలం కేంద్రం పై అబండాలు వేయడం కోసమే టీడీపీ ప్రభుత్వం పని చేసింది. టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి కేవలం మీడియాలోనే ఉంది.

రైతులను ఆదుకునే అంశంపై తొలి క్యాబినెట్‌లో నిర్ణయం. త్వరలో రైతులకు ఫించన్ అమలు‌లోకి వస్తుంది.

త్వరలో దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటికి పైపుల ద్వారా మంచి నీటిని ఇచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నాం. రాజ్యసభలో బీజేపీ బలం క్రమంగా పెరుగుతుంది.

రాజ్యసభలో బలం సరిపడా లేక చాలా బిల్లులు నిలిచిపోయాయి. 2022 నాటికి రాజ్యసభలో ఎన్డీఏకు పూర్తి స్దాయి సంఖ్య బలం వస్తుంది.

చట్టసభలలో అల్లర్లు చేసి, బిల్లులను అడ్డుకున్న పార్టీలు ప్రజా క్షేత్రంలో ఘోరంగా దెబ్బతిన్నాయి.

2024 లో అత్యధిక మెజారిటీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో దక్షణాది రాష్టాలలో అధికారాన్ని చేపడతాం.

వచ్చే నెల 6 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం కానుంది.

6 నెలల నుంచి ఏడాది లోపు ఏపీలో పూర్తి స్దాయి పార్టీ బలం చేకూరుతుంది అని జీవీఎల్ చెప్పుకొచ్చారు.

More News

నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త..

వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి గ్రామంలోనూ వాలంటీర్లను నియమించి అన్ని ప్రభుత్వ పథకాలను ఇంటికే చేర్చుతామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేసే క్రమంలో ఏపీ సర్కార్ అడుగులేస్తోంది.

తపిస్తున్నా.. అవినీతిని సహించే పరిస్థితే లేదు!

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిని ఆస్కారం లేదన్న సందేశం పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు వెళ్లాలని..

'కౌసల్య కృష్ణమూర్తి' కూడా అంతటి పేరు తెస్తుంది - కె.ఎస్‌. రామారావు

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల తేదీ మార‌లేదు

న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా మారింది. విశాల్ పాండ‌వ‌ర్ జ‌ట్టు, స్వామిశంక‌ర్ దాస్ జ‌ట్టు ఈసారి న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో పోటీ ప‌డుతున్నాయి.

జులై మొదటి వారంలో 'కాకతీయుడు'

తారకరత్న హీరోగా నటించిన 'కాకతీయుడు' చిత్రం విడుదలకు సిద్ధమైంది. వి.సముద్ర దర్శకత్వంలో