నడిగర్ సంఘం ఎన్నికల తేదీ మారలేదు
Send us your feedback to audioarticles@vaarta.com
నడిగర్ సంఘం ఎన్నికలు ఆసక్తికరంగా మారింది. విశాల్ పాండవర్ జట్టు, స్వామిశంకర్ దాస్ జట్టు ఈసారి నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. జూన్ 23న నడిగర్ సంఘం ఎన్నికలను నిర్వహించాలనుకున్నారు. అయితే సంఘం అధికారి ఎన్నికలను పోస్ట్ పోన్ చేశారు. దీంతో విశాల్ టీం దీనికి వ్యతిరేకంగా కోర్టులో రిట్ వేశారు. రిట్ను పరిశీలించిన కోర్టు నడిగర్ సంఘం ఎన్నికలను జూన్ 23నే నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరపరాదని ఆదేశించింది. కోర్టు తీర్పు పట్ల విశాల్ టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.