నిండు సభలో హార్థిక్ పటేల్కు ఘోర అవమానం!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు రాజకీయ నేతలు చేసే హడావుడి మామూలుగా ఉండదు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో వారు చేసే ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టి చేదు అనుభవాలు సైతం చవిచూడాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కంటే ఇతర రాష్ట్రాల్లోనే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి చెప్పు విసిరిన విషయం విదితమే. అయితే ఈ ఘటన మరువక ముందే గుజరాత్లో కాంగ్రెస్ నేత, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్కు ఘోర అవమానం జరిగింది.
వివరాల్లోకెళితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సురేందర్ నగర్ జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో హార్థిక్ పాల్గొన్నారు. సభకు వచ్చిన జనాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతుండగా అనూహ్య ఘటన జరిగింది. ఒక్కసారిగా స్టేజిపైకి వచ్చిన ఓ వ్యక్తి హార్థిక్ చెంప చెల్లుమనిపించాడు. ఈ హఠాత్పరిణామంతో సభికులంతా అవాక్కయ్యారు. అప్రమత్తమైన కార్యకర్తలు ఆ వ్యక్తిని పట్టుకుని చితక్కొట్టారు. స్టేజ్పైనే అక్కడున్న కార్యకర్తలు తలా ఓ చేయివేసి చావబాదాగా.. మరికొందరు హార్థిక అభిమానులు స్టేజ్ దించి పక్కకు లాక్కెళ్లి మరీ చితకబాదారు. హార్థిక్ను కొట్టిన వ్యక్తిని తరుణ్గా కార్యకర్తలు గుర్తించారు.
హార్థిక్ను ఎందుకు కొట్టాడు..!?
"గతంలో నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు పటేళ్లకు రిజర్వేషన్ కోసం ఉద్యమం జరిగింది. ఆ సమయంలో ఆమె అనారోగ్యానికి గురై చికిత్స తీసుకుంటోంది. అప్పట్లో ఉద్యమం కారణంగా నా భార్యను కాపాడుకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డాను. ఇన్ని ఇబ్బందులు పెడుతున్న వీడ్ని కచ్చితంగా కొట్టాలని అనుకున్నాను. కొన్ని రోజుల క్రితం అహ్మదాబాద్ లో నా బిడ్డ వైద్యానికి గాను మందుల కోసం వెళ్లాను. కానీ 'హార్దిక్ ర్యాలీ' వల్ల మా ప్రాంతంలోని షాపులన్నింటినీ మూసేశారు. అంతేకాదు కనీసం నడిచి వెళ్లడానికి రోడ్లు కూడా మూసేయించాడు. ఇలా ఇష్టానుసారం హార్థిక్ చేస్తుండటంతో పలుమార్లు నా కోపాన్ని అనుచుకున్నాను. అసలు వాడేమన్నా గుజరాత్ హిట్లరా?" అని తరుణ్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.