కథా చౌర్యం జరిగిందా?
- IndiaGlitz, [Monday,April 22 2019]
తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథను దర్శకుడు అట్లీ చోరీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పుట్బాల్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా కథ తనదంటూ సెల్వ అనే షార్ట్ ఫిలిం డైరెక్టర్ కోర్టుకెక్కాడు. తాను ఫుట్ బాల్ నేపథ్యంలో 265 పేజీల కథను రాసుకున్నానని సెల్వ తెలిపారు.
పలువురికి తన కథను వినిపిస్తున్న సందర్భంలో.. తన కథతోనే విజయ్, అట్లీ సినిమా తెరకెక్కుతోందని తెలిసి షాకయ్యానని ఆయన అన్నారు. అసలు విషయం తేలే వరకు సినిమా షూటింగ్ను ఆపాలంటూ సెల్వ కోర్టులో కేసు వేశారు. మంగళవారం ఈ కేసుపై విచారణ జరగనుంది. మరి దర్శక నిర్మాతలు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
తెరి, మెర్సల్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్, అట్లీ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. భారీ అంచనాలతో.. భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్గా 6 కోట్ల రూపాయల ఫుట్బాల్ గ్రౌండ్ సెట్ కూడా వేయడం విశేషం. ఇందులో నయనతార హీరోయిన్. ఈ ఏడాది దీపావళికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.