శ్రీలంక బాంబు దాడిలో తృటిలో తప్పించుకున్న టీడీపీ నేత
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లు ఈస్టర్డే నాడు రక్తపాతాన్నిసృష్టించాయి. ఈ నరమేధంలో వందలాదిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరెంతో మంది క్షతగాత్రులయ్యారు. కాగా.. ప్రమాదం నుంచి కొందరు ఆంధ్రులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
అనంతపురం జిల్లాకు చెందిన కొందరు శ్రీలంక పర్యటనకు వెళ్లారు. ప్రమాదం నుంచి వాళ్లంతా క్షేమంగా బయటపడ్డారు. టీడీపీ నేత, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబుకు స్వల్ప గాయమైంది. నలుగురు స్నేహితులతో కలిసి సురేంద్రబాబు శ్రీలంకకు విహారయాత్రకు వెళ్లారు.
కొలంబోలోని షంగ్రీలా హోటల్లో ఉన్నప్పుడు సమీపంలోనే ఒక్కసారిగా బాంబుపేలింది. షంగ్రీలా హోటల్లో అల్పాహారం తింటుండగా సమీపంలో పేలుడు జరిగినట్టు అనంతపురం బృందం తెలుసుకుంది. అదే సమయంలో ఆందోళన చెందవద్దని మైక్ ద్వారా హోటల్ సిబ్బంది చెప్పిన కారణంగా తోపులాట జరిగింది.
ఈ గందరగోళంలో అద్దం తగిలి సురేంద్రబాబుకు ముక్కుకు స్వల్ప గాయమైంది. అక్కడినుంచి హడావుడిగా బయటకు వచ్చిన వారందరి పాస్ పోర్టులు, ఇతర పత్రాలన్నీ హోటల్ గదిలోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే భారత్కు చెందిన వారిని క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు విదేశాంగ శాఖ శ్రీలంక సర్కార్తో చర్చలు జరుపుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.