close
Choose your channels

భాగ్యనగరాన్ని మరోసారి ఉగ్రవాదులు టార్గెట్ చేశారా..!?

Sunday, April 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భాగ్యనగరాన్ని మరోసారి ఉగ్రవాదులు టార్గెట్ చేశారా..!?

హైదరాబాద్‌ను మరోసారి ఉగ్రవాదులు టార్గెట్ చేశారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. శనివారం రోజున భాగ్యనగరంలో ఎన్ఐఏ చేసిన సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే మైలార్‌దేవ్‌పల్లిలో ఐసిస్ లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కింగ్స్ కాలనీలో తహన్ అనే యువకుడ్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పక్కా ఆధారాలతో తహన్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తహన్ నాలుగు నెలలుగా కింగ్స్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం తహన్‌ను గచ్చిబౌలి ఎన్ఐఏ ఆఫీస్‌కు తరలించారు.

కుట్రను కనిపెట్టిందెవరు..!?

గతంలో పట్టుబడ్డ బాసిత్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా.. హైదరాబాద్‌కు చెందిన బాసిత్.. ఐసిస్ సానుభూతి పరుడన్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీకి చెందిన ఆర్ఎస్ఎస్ నేతను అంతం చేయడానికి చేసిన ప్లాన్‌ను కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసి ఆయనతో పాటు నలుగుర్ని అరెస్ట్ చేసింది. ఉగ్రవాద కోణంలో 8 మంది అనుమానితుల ఇళ్లలో అధికారులు సోదాలు జరిపారు. స్థానిక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, ఎన్‌ఐఏ సంయుక్తంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

నలుగురు సానుభూతి పరులు అరెస్ట్..!

కాగా.. శనివారం సాయంత్రానికి హైదరాబాద్‌లో మొత్తం మూడు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. మొత్తం నలుగురు ఐసిస్ సానుభూతిపరులు అదుపులోకి ఎన్‌ఐఏ తీసుకున్నది. వారి నుంచి 13 సెల్‌ఫోన్లు, 2 ల్యాప్‌ట్యాప్‌లు, హార్డ్‌డిస్క్, 6 పెన్‌డ్రైవ్‌లు, 6 ఎస్‌డీ కార్డులు, 3 వాకీటాకీలు, పలు కీలక పత్రాలు ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. 2016 అబుదాబి ఐసిస్ మాడ్యుల్ కేసులో నిందితుడు అబ్దుల్ బాసిత్ ఇచ్చిన సమాచారంతో ఎన్‌ఐఏ సోదాలు చేసి ఈ మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.