తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. యాక్సిడెంట్‌లో హీరో సోదరుడు దుర్మరణం

  • IndiaGlitz, [Wednesday,December 01 2021]

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు, కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్‌లు మరణించగా.. నిన్న గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈ విషాదాల నుంచి తేరుకోక ముందే తెలుగు చిత్ర సీమలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. యువ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూశారు. బుధవారం ఉదయం క‌డ‌ప జిల్లా చెన్నూరు వ‌ద్ద జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో రామాంజులు రెడ్డి తీవ్ర గాయాలతో మృతిచెందారు. దీంతో కిరణ్ అబ్బవరం కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

కిర‌ణ్.. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఆయ‌న క‌థ అందించిన ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా యువతలో కిరణ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఆయన హీరోగా కొత్త చిత్రాన్ని సైతం పట్టాలెక్కించారు. భారీ చిత్రాలను నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ , మత్తు వదలరా వంటి సినిమాను నిర్మించిన క్లాప్ ఎంట‌ర్‌టైన్మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా కిర‌ణ్ అబ్బ‌వ‌రంతో మూవీని తెరకెక్కిస్తున్నాయి. రీసెంట్‌గానే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. అలా కెరీర్‌లో మంచి జోష్‌లో వున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రంకు త‌మ్ముడి మ‌ర‌ణం ఒక షాక్‌గానే చెప్పవచ్చు. రామాంజులు రెడ్డి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌పై కోపం.. హౌస్‌లో గొడవలన్నింటికీ ఆమె కారణం, కాజల్‌పై అరిచేసిన పింకీ

బిగ్‌బాస్ 5 తెలుగులో మరోసారి  నామినేషన్ల వల్ల రచ్చ లేచింది. సోమవారం నాటి నామినేషన్స్ సందర్భంగా ఇంటి సభ్యులు డిస్కషన్ చేసుకున్నారు.

'గేమ్ ఆన్' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న "గేమ్ ఆన్" సినిమా రవి కస్తూరి సమర్పణలో

‘స్కై లాబ్‌’ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంది : హీరో స‌త్య‌దేవ్‌

వెర్సటైల్ యాక్టర్స్ స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవి కిరణ్‌ సమర్పణలో

ఈ దర్శకులు సినిమా తీస్తే.. ఆయన పాట వుండాల్సిందే, ఇది ‘‘ సిరివెన్నెల ’’ ప్రస్థానం..!!

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: కాజల్‌ని టార్గెట్ చేసిన ఆ నలుగురు.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవంటే..?

బిగ్‌బాస్ 5 తెలుగు చివరి దశకు చేరుకోవడంతో షో ఉత్కంఠగా మారుతోంది. ఇక కొద్దివారాలే మిగిలి వుండటంతో ఎవరు ఉంటున్నారు..?