close
Choose your channels

‘సాహో’కు చెర్రీకి సంబంధమేంటి!?

Tuesday, August 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘సాహో’కు చెర్రీకి సంబంధమేంటి!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆగస్టు 30న అభిమానుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాపై పెద్ద ఎత్తున వార్తలే కాదు.. పుకార్లు సైతం వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్, శ్రద్దా రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్తలు ఓ రేంజ్‌లో హల్ చల్ చేయగా.. తాజాగా ‘సాహో’కు చెర్రీకి సంబంధం ఉందంటూ పుకార్లు రేగాయి. అసలు సాహో సినిమాకు చెర్రీకి సంబంధమేంటో ఈ కథనంలో చూద్దాం.

వాస్తవానికి ‘సాహో’ కోసం ముందుగా అనుకున్న బడ్జెట్‌కు, తర్వాత బడ్జెట్ మారిపోయిందన్న విషయం తెలిసిందే. ఈ విషయం స్వయానా నిర్మాత, ప్రభాస్ కూడా మీడియా ముందుకొచ్చిన సందర్భాలున్నాయ్. అయితే ఇంత భారీ బడ్జెట్ పెట్టే కమ్రంలో నిర్మాతలకు ఒకానొక సందర్భంలో ఒత్తిడి ఎదురైందట. సినిమా పరిస్థితి ఏంటి..? అని ఆలోచిస్తుండగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దిగారట. ప్రభాస్‌-రామ్ చరణ్ ఇద్దరూ మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. మిత్రుడు నటిస్తున్న మూవీ గురించి ఇలా వార్తలు వస్తుండటంతో స్వయంగా రంగంలోకి దిగి యు.వి క్రియేషన్స్‌ అండగా నిలిచి.. ఆర్థికంగా కూడా తాను ఓ చెయ్యేస్తానని హామీ ఇచ్చారట.

అలా సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతగా.. సాహో నిర్మాతలు.. వచ్చిన లాభాల్లో వాటా తీసుకోవాలని చెర్రీకి ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. అంతేకాదు.. రామ్‌చరణ్‌ కూడా నిర్మాతల మాటను కాదనలేక నవ్వూతూ ఓకే అనేశారట. అయితే ఈ విషయంపై ఇటు చెర్రీగానీ.. అటు చిత్రబృందం కానీ అస్సలు రియాక్ట్ కాలేదు. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.