మరో అమితాబ్ రీమేక్లో హృతిక్
- IndiaGlitz, [Thursday,July 11 2019]
బాలీవుడ్ గ్రీకు హీరో హృతిక్ రోషన్.. త్వరలోనే అమితాబ్ సినిమా రీమేక్లో నటించనున్నారు. 1982లో అమితాబ్ బచ్చన్, హేమా మాలిని నటించిన 'సత్తే పే సత్తా'. ఈ సినిమాను ఇప్పుడు రీమేక్ చేయబోతున్నారు. ఇది వరకు హృతిక్ అమితాబ్ నటించిన 'అగ్నిపథ్' సినిమాను రీమేక్ చేశారు. కాగా అన్ని సవ్యంగా జరిగితే.. ఇది ఆయన రీమేక్ చేయబోయే రెండో సినిమా అవుతుంది. ఫర్హాఖాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారట. ప్రముఖ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. దీపికా పదుకొనెను హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై మరింత క్లారిటీ రానుంది. ఈ శుక్రవారం హృతిక్ గణిత జీనియస్ ఆనంద్ కుమార్ బయోపిక్ 'సూపర్ 30'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.