షాకింగ్ ధరకు సైరా శాటిలైట్ హక్కులు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హిస్టారికల్ చిత్రం సైరా నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.
అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్సేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా, అనుష్క, జగపతిబాబు, నిహారిక తదితరులు నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలతో సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ మొత్తానికే అయ్యిందని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకుందని సమాచారం. అలాగే తాజాగా ఈ సినిమా అన్ని భాషలకు సంబంధించిన శాటిలైట్ హక్కులను ప్రముఖ జీ నెట్వర్క్ సంస్థ రూ .125 కోట్లకు చేజిక్కించుకుందని సమాచారం. ఇది ఓ రకంగా ఓ కొత్త రికార్డే అని చెప్పవచ్చు.
ఇటీవల డిజిటల్ హక్కుల విషయంలోనూ అమెజాన్ ప్రైమ్ సంస్థ రూ. 40 కోట్లను చెల్లించింది. ఇంత మొత్తంలో డిజిటల్ హక్కులను దక్కించుకున్న తొలి దక్షిణాది చిత్రం కూడా సైరా నరసింహారెడ్డినే అని టాక్. దాదాపు రూ.300కోట్ల భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వేల్యూస్తో, భారీ తారాగణంతో రూపొందిన చిత్రమిది. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.