హైదరాబాదీలకు బంపరాఫర్.. రూ.59తో మెట్రోలో రోజంతా ప్రయాణం, కానీ..?

  • IndiaGlitz, [Thursday,March 31 2022]

ప్రజలను ట్రాఫిక్ కష్టాలకు దూరంగా, సుఖమయ, సురక్షిత ప్రయాణాన్ని అందిస్తోన్న హైదరాబాద్‌ మెట్రో ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటోంది. అయితే భారీ ఛార్జీల కారణంగా కొందరు మెట్రో ఎక్కాలంటే జేబు తడుముకుంటున్నారు. అలాంటిది కేవలం రూ.59కి రోజంతా నగరం మొత్తం ప్రయాణించే ఛాన్స్ దొరికితే... ఎగిరి గంతేస్తారు కదూ.

నగర ప్రజలకు హైదరాబాద్‌ మెట్రో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. మెట్రో రైల్లో ‘సూపర్ సేవర్‌ కార్డు’ పేరుతో కొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి సూపర్ సేవర్‌ కార్డును ప్రారంభించారు. ఈ కార్డుతో సెలవు దినాల్లో కేవలం రూ.59తో రోజంతా మెట్రోలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని మెట్రో ఎండీ చెప్పారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవు దినాల్లోనే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని వివరించారు.

సెలవులివే..

ప్రతి ఆదివారం, ప్రతి రెండు, నాలుగో శనివారం, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే (డిసెంబరు 26), బోగీ, సంక్రాంతి, శివరాత్రి

కాగా.. కరోనా కారణంగా హైదరాబాద్ మెట్రో రైల్ భారీ నష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కరోనాకి ముందు ఉన్న రద్దీ మెట్రోలో కనిపించడం లేదు. సాధారణ పరిస్థితులు నెలకొన్నా ప్రయాణికుల రద్దీ 25 శాతానికి పైనే పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం మెట్రోకు శరాఘాతంలా తగిలింది. ఈ చార్జీల ప్రభావం మెట్రోపై పడుతుందని ఎల్అండ్‌టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో మెట్రో ఛార్జీలు పెరుగుతాయంటూ ప్రచారం జరుగుతోంది.

More News

వరంగల్ ఎంజీఎంలో దారుణం: ఐసీయూలో రోగిపై ఎలుకల దాడి..  విచక్షణారహితంగా కొరికేసిన మూషికాలు

వేలు, లక్షలు పోసి కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు.

ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష, జరిమానా విధించిన ఏపీ హైకోర్టు.. ఎందుకంటే..?

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది.

రాజ‌కీయాల‌లోకి అనవసరంగా వెళ్లా.. తాప్సీతో ఛాన్స్ మిస్ అయ్యా: చిరు హాట్ కామెంట్స్

అప్పట్లో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ.. అందం, అభినయంతో ఆకట్టుకున్న తాప్సీ పన్ను  తర్వాత బాలీవుడ్ చెక్కేసిన సంగతి తెలిసిందే.

‘‘ది కశ్మీర్ ఫైల్స్’’ రగడ : కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడి, సీఎం హత్యకు కుట్రపన్నారన్న ఆప్

'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. కొందరు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే..

ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం.. ఏప్రిల్ 4 నుంచి పాలన ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలకు ఏపీ కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది.