Hyderabad Police : డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే లైసెన్స్ రద్దు, మైనర్లయితే తల్లిదండ్రులు జైలుకే

  • IndiaGlitz, [Friday,June 10 2022]

మొన్నటి దాక మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారిని కంట్రోల్ చేయడానికి జరిమానాలు విధించడం.. వాహనాలు సీజ్ చేయడం.. కౌన్సెలింగ్ ఇవ్వడం వంటితో సరిపెట్టేవారు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు. కానీ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకు ప్రమాదాలు పెరుగుతుండటంతో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా.. ఇప్పటినుంచి మద్యం తాగి ఎవరైనా డ్రైవ్ చేస్తే వారికి మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు మరిన్ని శిక్షలకు గురికానున్నారు.

ప్రతి కేసూ కోర్టులో నమోదు.. భవిష్యత్తుకు ఇబ్బందులే:

ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌లో చిక్కిన వారి వివరాలు కోర్టుకు సమర్పించి లైసెన్స్‌ రద్దు ఉత్తర్వులను రవాణా శాఖకు పంపించనున్నారు. అలాగే మద్యం మత్తులో ప్రమాదాలు పెరుగుతుండడంతో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలనూ పెంచనున్నారు పోలీసులు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దయితే ఏం కాదులే అని ఊరుకుంటే వాహనదారులు పప్పులే కాలేసినట్లే. ఎందుకంటే పరిమితికి మించి మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడితే భవిష్యత్తులో చాలా కష్టాలొస్తాయి.

నేరానికి సంబంధించి కోర్టులో ప్రతి కేసూ నమోదవుతుంది. జైలుకు వెళ్తే ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. విద్యార్థులు, యువకులకు ఉద్యోగాల కోసం ప్రయత్నించినప్పుడు వెరిఫికేషన్ సమయంలో ఈ కేసులు ప్రతిబంధకాలవుతాయి. అంతేకాదు.. విదేశాలకు వెళ్లేందుకు కూడా అవకాశం వుండదు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే లైసెన్స్‌ తాత్కాలికంగా రద్దవుతుందని.. తీవ్రత అధికంగా వున్న పక్షంలో శాశ్వతంగానూ రద్దవ్వొచ్చని నగర ట్రాఫిక్ విభాగం సంయుక్త కమీషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.

మైనర్లపై ప్రత్యేక నిఘా:

ఇటీవల నగరంలో మైనర్ల ఆగడాలు శృతిమించడంతో వారిపై ఓ కన్నేసి వుంచాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. జూబ్లీహిల్స్‌లో అమ్నేషియా పబ్ అత్యాచారం నేపథ్యంలో మెర్సిడెస్‌ బెంజ్‌, ఇన్నోవా కార్లను మైనర్లు నడిపారని తేలడంతో వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు మోటారు వాహన చట్టం ప్రకారం వారి తల్లిదండ్రులనూ జైలుకు పంపించనున్నారు. మైనర్లు కార్లను వేగంగా నడిపి ప్రమాదాలు చేస్తుండటంతో పాటు కిడ్నాప్‌లు.. అత్యాచార యత్నాలకు కార్లు వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కార్లు, బైకులు నడుపుతోన్న 14 ఏళ్ల పిల్లలు:

ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడినా.. సీసీ కెమెరాలకు చిక్కినా వారిపై కేసులు నమోదు చేయనున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 14 ఏళ్ల పిల్లలూ కార్లు, బైకులు నడుపుతున్నారన్న సమాచారంతో సంయుక్త కమిషనర్‌(ట్రాఫిక్‌) ఏవీ రంగనాథ్‌ పోలీస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇలాంటి ఘటనలపై చట్టపరంగా వ్యవహరించాలని, మైనర్లపై కోర్టుల్లో ఛార్జిషీట్ సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

More News

pooja hegde: పూజా హెగ్డే పట్ల ఇండిగో ఉద్యోగి అసభ్య ప్రవర్తన.. భయం వేసిందన్నబుట్టబొమ్మ

దేశంలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవల కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది.

Major: మేజర్ చూసి ఆమె నన్ను హత్తుకున్నారు.. నాపై ఇంకా బాధ్యత పెరిగింది: శశికిరణ్‌ తిక్క

మంచి సినిమా చేస్తామని మేజర్ సందీప్ తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు

Credit Card-UPI : ఇక క్రెడిట్ కార్డుతోనూ యూపీఐ పేమెంట్స్... బోలెడన్నీ లాభాలు..?

దేశంలో నోట్ల రద్దు తర్వాతి నుంచి డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.

sajjala rama krishna reddy: మీ ‘‘బ్రోకర్’’ బాగోతం మొత్తం తెలుసు.. పవన్ జోలికొచ్చారో : సజ్జలకు పోతిన మహేశ్ వార్నింగ్

వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్.

nadendla manohar: వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం.. తాగునీటి కోసం 8 లక్షల మంది కటకట: నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. పోలవరంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్మించిన