నాతో సినిమా చేయమని ఆయన్నొక్కడినే అడిగాను: పవన్

  • IndiaGlitz, [Friday,February 05 2021]

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం పుట్టినరోజు నేడు. ప్రస్తుతం రత్నం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడం విశేషం. అంతేకాకుండా పవన్‌తో ఆయన కొత్తగా ఏమీ సినిమా చెయ్యట్లేదు. పవన్ కెరీర్‌కే టర్నింగ్ పాయింట్ వంటి చిత్రాన్ని గతంలోనే నిర్మించారు. ఈ సినిమా పేరే ‘ఖుషీ’. ఏఎం రత్నం పుట్టినరోజు సందర్భంగా పవన్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. దశాబ్దం కిందటే భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు నిర్మించి విజయాలు సాధించిన ఘనత ఏఎం రత్నందే అని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసించారు. తెలుగు, తమిళ చిత్రాల మార్కెట్ పరిధి విస్తరించడంలో ఏఎం రత్నం పాత్ర మరువలేనిదన్నారు. తనతో సినిమా చేయమని ఒక్క ఏఎం రత్నంని తప్ప ఇప్పటి వరకూ ఎవరినీ అడగలేదని పవన్ తెలిపారు. ఆయనతో ఎప్పటి నుంచో పరిచయం ఉందని పవన్ వెల్లడించారు.

ఏఎం రత్నం బంధువు నెల్లూరులో తనకు మంచి మిత్రుడని తెలిపారు. ఆయనతో ఉన్న పరిచయంతో తను ఎప్పుడూ చెన్నైలో రత్నంని కలుస్తుండేవాడినని పవన్ గుర్తు చేసుకున్నారు. ఆయన 'ఖుషీ' సినిమాను నిర్మించి తనకు మరచిపోలేని హిట్ ఇచ్చారన్నారు. సినిమాలో కళాత్మకత ఎక్కడా తగ్గకుండానే వాణిజ్య అంశాలను, ఆధునిక సాంకేతికత మేళవించి మన సినిమాల మార్కెట్ పరిధి పెంచారని వెల్లడించారు. ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు.

More News

'ఉప్పెన' ట్రైలర్ లో ఇవి గమనించారా?

మెగా ఫ్యామిలీ  నుండి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. ఇంటి పేరు పంజా. ముగ్గురు మొనగాళ్లు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ల ముద్దుల మేనల్లుడు.

మండుటెండలో నేలపై కూర్చొన్న మహేష్ దర్శకుడు.. నెటిజన్ల ప్రశంసలు

దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా ఆయనపైనే ఆధారపడి ఉంటుంది.

రుణయాప్‌లను బ్లాక్ చేయాలి: హైకోర్టు ఆదేశం

రుణయాప్‌లను బ్లాక్ చేయాలని తెలంగాణ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. రుణయాప్‌లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

విజయ్ కోసం ఆమె అభిమానం ‘హద్దు’లు దాటింది.

ఓ యువతి అభిమానం ‘హద్దు’లు దాటింది. ఆమె చేసిన పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘మాస్టర్’

'డియర్ మేఘ' ఫస్ట్ లుక్ రిలీజ్

మేఘా ఆకాష్,అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ''డియర్ మేఘ''.