close
Choose your channels

నాతో సినిమా చేయమని ఆయన్నొక్కడినే అడిగాను: పవన్

Friday, February 5, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాతో సినిమా చేయమని ఆయన్నొక్కడినే అడిగాను: పవన్

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం పుట్టినరోజు నేడు. ప్రస్తుతం రత్నం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడం విశేషం. అంతేకాకుండా పవన్‌తో ఆయన కొత్తగా ఏమీ సినిమా చెయ్యట్లేదు. పవన్ కెరీర్‌కే టర్నింగ్ పాయింట్ వంటి చిత్రాన్ని గతంలోనే నిర్మించారు. ఈ సినిమా పేరే ‘ఖుషీ’. ఏఎం రత్నం పుట్టినరోజు సందర్భంగా పవన్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. దశాబ్దం కిందటే భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు నిర్మించి విజయాలు సాధించిన ఘనత ఏఎం రత్నందే అని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసించారు. తెలుగు, తమిళ చిత్రాల మార్కెట్ పరిధి విస్తరించడంలో ఏఎం రత్నం పాత్ర మరువలేనిదన్నారు. తనతో సినిమా చేయమని ఒక్క ఏఎం రత్నంని తప్ప ఇప్పటి వరకూ ఎవరినీ అడగలేదని పవన్ తెలిపారు. ఆయనతో ఎప్పటి నుంచో పరిచయం ఉందని పవన్ వెల్లడించారు.

ఏఎం రత్నం బంధువు నెల్లూరులో తనకు మంచి మిత్రుడని తెలిపారు. ఆయనతో ఉన్న పరిచయంతో తను ఎప్పుడూ చెన్నైలో రత్నంని కలుస్తుండేవాడినని పవన్ గుర్తు చేసుకున్నారు. ఆయన `ఖుషీ` సినిమాను నిర్మించి తనకు మరచిపోలేని హిట్ ఇచ్చారన్నారు. సినిమాలో కళాత్మకత ఎక్కడా తగ్గకుండానే వాణిజ్య అంశాలను, ఆధునిక సాంకేతికత మేళవించి మన సినిమాల మార్కెట్ పరిధి పెంచారని వెల్లడించారు. ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.