PawanKalyan: భీమవరాన్ని వదలను.. కచ్చితంగా గెలిచి తీరాలి: పవన్ కల్యాణ్‌

  • IndiaGlitz, [Tuesday,March 12 2024]

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్ల కోతపై జనసేనాని పవన్ కల్యాణ్‌ స్పందించారు. సీట్లు తక్కువా.. ఎక్కువా.. అనేది పక్కన పెట్టండని..175 స్థానాల్లో జనసేన, టీడీపీ, బీజేపీలు పోటీ చేస్తున్నాయని భావించాలని పిలుపునిచ్చారు. సీట్లు తగ్గిపోయాయని కొందరు బాధపడుతున్నారని.. కానీ గతంలో తాను గెలిచి ఉంటే.. ఇవాళ పరిస్థితి వేరేగా ఉండేదని. గతంలో జరిగిన తప్పిదాలకు ఇప్పుడు తాను పరిహరం కడుతున్నానని తెలిపారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే.. బంధుత్వాల పేరుతో ఇబ్బంది పెట్టారు. యుద్దం చేయనీకుండా నాకు సంకెళ్లు వేశారు. భీమవరంలో కంటే పులివెందులలో పోటీ చేసి ఉంటే బాగుండేదని అనుకున్నా. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోయి ఉన్నా.. నేను బాధపడేవాడిని కాదు. ఇవాళ నవశకం ప్రారంభించాం. భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి.. పొత్తులను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి నేను ఓడిపోతే.. నాపై పోటీ చేసిన రామాంజనేయులు చాలా బాధపడ్డారు. భీమవరంలో పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికి కూడా స్థలం ఇవ్వకుండా ఎమ్మెల్యే గ్రంధి అడ్డుకున్నారు. నేను పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికే అడ్డుకున్నారంటే.. ఎంత రౌడీయిజం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి.

గ్రంధి శ్రీనివాసును అక్కడి నుంచి తరిమేయాలి. ఓ వీధిరౌడీని ఎమ్మెల్యే చేయడం వల్ల భీమవరంలో నిమ్మకాయ షోడా అమ్ముకునే వ్యక్తిని కూడా బెదిరించే పరిస్థితి వచ్చింది. తన డ్రైవరును చంపి డోర్ డెలివరి చేసిన అనంతబాబు మన కులస్తుడేనని వదిలేస్తామా..? జైలుకెళ్లిన అనంతబాబు బెయిల్ మీద వస్తే.. బాస్ ఈజ్ బ్యాక్ అనడం కరెక్టేనా..? పార్టీ పెట్టడానికి సొంత అన్నను కూడా కాదని వచ్చాను. నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను.. కానీ ఎదుటి వాళ్లు యుద్దం కోరుకుంటే నేను దానికి రెడీ..

సిద్ధం అంటూ జగన్ కోకిలలా కూస్తున్నాడు. జగన్‌తో యుద్ధానికి సిద్దం. రాష్ట్రంలోని జలగలను తీసేస్తాం.. భీమవరంలో ఉన్న జలగను కూడా తీసేస్తాం. రాజకీయాల్లో యుద్ధం ఉండాలి కానీ బంధువత్వం ఉండకూడదు. వచ్చే ఎన్నికల్లో భీమవరాన్ని కొట్టి తీరాలి. భీమవరంలో జనసేన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఏపీనే కాపాడుకునేవాడిని.. భీమవరాన్ని కాపాడుకోలేనా..? భీమవరాన్ని నేను వదలను పవన్ కల్యాణ్ తెలిపారు.

ఇక మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ భీమవరం అభ్యర్థిని తాను కాదని.. పవన్ కల్యాణే పోటీ చేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం తపన పడే ఏకైక నాయకుడు పవన్ అని.. ఆయన ఆశయాలకు ఆకర్షితుడై జనసేనలో చేరినట్టు చెప్పారు. మంచి వాళ్లు రాజకీయాల్లోకి రావాలంటూ సమాజం కోసం త్యాగాలు చేసిన నేత పవన్ అని ప్రశంసించారు. పవన్ వల్లే టీడీపీతో బీజేపీ జతకట్టిందని.. మూడు పార్టీల మధ్య పొత్తుకు ప్రధాన కారణం ఆయనేనని చెప్పుకొచ్చారు. 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఇద్దరి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే భీమవరం నుంచి పవన్ కల్యాణ్‌ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

More News

Pawan Kalyan: చంద్రబాబు వ్యూహంలో చిక్కుకుపోయిన జనసేనాని.. రగిలిపోతున్న కార్యకర్తలు..

రాష్ట్ర రాజకీయాలను మారుస్తాను.. అధికారంలో భాగస్వామ్యం అవుతాం.. అంటూ బీరాలు పలికిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఎంతలా అంటే పొత్తులో భాగంగా 175 సీట్లలో కేవలం 24 సీట్లు,

Bhatti Vikramarka: యాదాద్రి వివాదంపై స్పందించిన భట్టి విక్రమార్క.. ట్రోల్స్‌కు కౌంటర్..

యాదాద్రి వివాదంపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నాను అని స్పష్టంచేశారు. ఈ ఫోటోను పట్టుకుని కావాలని కొందరు

SK30: 'ధమాకా' డైరెక్టర్‌తో సందీప్ కిషన్.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

యువ హీరో సందీప్ కిషన్ ఇటీవల 'ఊరుపేరు భైరవకోన' చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. దీంతో ఇదే సక్సెస్ కొనసాగేందుకు పక్కా ప్లానింగ్‌తో కథలు సెలెక్ట్ చేసుకున్నాడు.

Geethanjali: గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్ భరోసా.. రూ.20లక్షల ఆర్థికసాయం ప్రకటన..

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకుందా..?

Vijay Thalapathy: సీఏఏ చట్టం అమలుపై తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తీవ్ర ఆగ్రహం

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.