తెలంగాణలో మరింత ఉధృతమవుతోన్న కరోనా

  • IndiaGlitz, [Wednesday,June 24 2020]

తెలంగాణలో పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతోంది. కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. నిన్న కొత్తగా 879 కేసులు నమోదయ్యాయి. మొత్తం 3006 శాంపిల్స్‌ను పరీక్షించగా 879 పాజిటివ్‌గా తేలాయి. వీటిలో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం. ఇక్కడ ఏకంగా 652 కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా.. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది.

ప్రస్తుతం తెలంగాణను కలవరపరుస్తున్న అంశం ఇదే. పాజిటివ్ రేటు ఏప్రిల్‌లో కేవలం 5.9 ఉండగా.. మేలో 14.31.. జూన్‌కి వచ్చే వరకూ 21.58కి చేరుకుంది. కాగా.. ప్రస్తుతం ప్రభుత్వ ల్యాబ్‌లలో రోజుకు 2290 టెస్టులు చేసే సామర్థ్యమే ఉంది. మరో వారం పదిరోజుల్లో వాటి సామర్థ్యం రోజుకు 6600లకు పెరగొచ్చు. ఆ సమయంలో కేసుల సంఖ్య మరింత పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

More News

ఏపీలో 10 వేలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10వేల మార్క్ దాటింది. 36 వేల 47 శాంపిల్స్‌ను పరీక్షించగా..

సూర్యాకాంతం సీరియల్ షూటింగ్ ప్రారంభమైన కాసేపటికే ప్యాకప్..

గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో సీరియల్స్ షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. కొన్ని ఛానళ్లలో సీరియల్స్ ఇప్పటికే ప్రారంభమవగా..

ఆసక్తి పెంచుతున్న ‘భానుమతి రామకృష్ణ’ టీజర్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకు ప్రారంభ‌మైన ప‌క్కా తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’.

నందినీ రాయ్ సూసైడ్ స్టోరీ

సెలబ్రిటీ హోదా రాగానే బాధ్యత పెరుగుతుంది. దాని వల్ల తెలియకుండా ఇన్ సెక్యూరిటీ పెరుగుతుంది.

‘హిర‌ణ్య’ ప్రీ ప్రొడ‌క్ష‌న్ పూర్తి.. హీరో మారుతాడా?

భారీ సెట్స్ వేసి సినిమాలు చేయడంలో డైరెక్టర్ గుణశేఖర్ దిట్ట‌. ఈయ‌న తెర‌కెక్కించిన గ‌త చిత్రం రుద్ర‌మ‌దేవి.