'రాధేశ్యామ్’లో పూజా పాత్రపై ఆసక్తికర టాక్

  • IndiaGlitz, [Sunday,April 18 2021]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. ఈ సినిమాలో ప్రభాస్, పూజాలు విక్రమాదిత్య, ప్రేరణ అనే పాత్రల్లో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ పూర్తి స్థాయి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి రిలీజైన అప్‌డేట్స్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేవిగానే ఉన్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పూర్తి లవ్ అండ్ ఎంటర్‌టైనర్ కావడంతో యూత్‌లో మరింత ఆసక్తి పెరిగింది.

ప్రభాస్ నేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవడం.. ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఆయన ఇమేజ్‌ను ఈ చిత్రం మరింత పెంచే అవకాశం ఉంది. యూవీ కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో గోపీకృష్ణా మూవీస్‌, యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై వంశీ, ప్రమోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ సహా కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ పీరియాడిక్ లవ్‌స్టోరి షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ తెగ వైరల్ అవుతోంది.

ప్రభాస్ సంగతి పక్కనబెడితే ఈ సినిమాలో పూజా పాత్రేంటనేది ఆసక్తికరంగా మారింది. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డాక్టర్‌ ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే కనిపించనుందని టాక్. ఓ ప్రమాదంలో గాయపడిన విక్రమాదిత్యకు హాస్పిటల్‌లో ప్రేరణ చికిత్స చేస్తుందట. ఆ సమయంలోనే విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథ మొదలవుతుందట. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

More News

సోనూసూద్‌కి కరోనా.. అద్భుతమైన మెసేజ్ ఇచ్చారుగా..

కరోనా మహమ్మారి భారతదేశంలో ప్రవేశించిన సమయంలో ప్రముఖ నటుడు సోనూసూద్ అందించిన సేవలు ఎవరూ మరచిపోలేరు.

ఏప్రిల్ 30న ‘థాంక్యూ బ్రదర్’ ... రిలీజ్ డేట్‌ను ట్విట్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేసిన అక్కినేని నాగ‌చైత‌న్య‌

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’.  ర‌మేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వం

మాజీ మంత్రి మోత్కుపల్లికి కరోనా.. పరిస్థితి విషమం

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది.

‘కరోనా టీకాతోనే నటుడు వివేక్ మృతి’

కరోనా టీకా కారణంగానే ప్రముఖ నటుడు వివేక్ మ‌ృతి చెందారని తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ స్పష్టం చేశారు.

సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన నటుడు నరేష్

ప్రముఖ సినీ నటుడు సీనియర్ నరేష్.. స్టోన్ ఇన్‌ఫ్రా కంపెనీ యజమానిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.