ఏప్రిల్ 6న 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' విడుదల

  • IndiaGlitz, [Saturday,March 17 2018]

నందు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “ఇంతలో ఎన్నెన్ని వింతలో”.హరిహర చలన చిత్ర సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మాతలు. వరప్రసాద్ వరికూటి దర్శకత్వం వహిస్తున్నారు.

నందు హీరోగా సౌమ్య వేణుగోపాల్ నాయికగా పూజ రామచంద్రన్ కీలక పాత్రలలో వస్తున్న ఈ చిత్రం విడుదల సందర్బగా నిర్మాత ఇప్పిలి రామమోహన రావు మాట్లాడుతూ... యాజమాన్య సంగీతం లో  ఇటీవలే విడుదలైన మా ఆడియో లో సురేష్ ఉపాధ్యాయ రాసిన ఎన్నో రంగుల్లో ముంచేస్తుందే ఈ సమయం.... అనే పాటకు యు ట్యూబ్ లో 1.5 మిలియన్  పైగా వీక్షకులను ఆకట్టుకుంది, మా చిన్న చిత్రానికి ఇంత స్పందన రావడం ఆనందంగా ఉందని తెలియపరుస్తూ, మా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న గ్రాండ్ గా విడుదల చేస్తున్నామని తెలియపరిచారు.

నల్లవేణు, దువ్వాసి మోహన్, నరసింహా, కృష్ణ తేజ, త్రిశూల్, గగన్ విహారి, రమేష్, భార్గవ్, కిషోర్ దాస్, సత్తన్న, దుర్గారావు, మీనా వాసుదేవ్, కౌశిక్, పద్మ జయంతి, సోనక్షీ వర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత - డి.శ్రీనివాస్ ఓంకార్, కెమెరామెన్ - ఎస్ మురళీ మోహన్ రెడ్డి, ఎడిటింగ్ - ఛోటా కె ప్రసాద్, సంగీతం - యాజమాన్య, ఆర్ట్ - జిల్ల మోహన్, స్టంట్స్ - మర్సాల్ రమణ, కొరియోగ్రఫీ - విఘ్నేశ్వర్, సాహిత్యం - సురేష్  ఉపాధ్యాయ, పి.ఆర్.ఓ. రాంబాబు కడలి,కో డైరక్టర్ - రామ్ ప్రసాద్ గొల్లపల్లి,రచనా సహకారం, శివ యుద్ధనపూడి

More News

రెండు వారాల పాటు 'శ్రీ‌నివాస క‌ళ్యాణం' తొలి షెడ్యూల్‌

నితిన్, రాశి ఖన్నా జంటగా సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’.

గోపీచంద్ 'పంతం' ఫ‌స్ట్‌లుక్ అప్‌డేట్‌

యాక్షన్ హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన గోపీచంద్‌కు ‘జిల్’ (2015) సినిమాతో విజయాలకు బ్రేక్ పడింది.

మనం సైతం టీషర్టు ఆవిష్కరించిన తమన్నా

నిస్సహాయులకు అండగా నిలుస్తున్న మనం సైతం సంస్థ కార్యక్రమాలను ప్రముఖ నాయిక తమన్నా అభినందించారు.

ఒకే చిత్రంలో నిత్యా, సాయి ప‌ల్ల‌వి?

ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలలో నటనా ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలంటే దర్శకనిర్మాతల చూపు ఆ ఇద్దరి నటీమణుల వైపే ఉంటుంది.

బాల‌య్య ద్వితీయార్థం బిజీ బిజీ

ఈ ఏడాది సంక్రాంతికి ‘జై సింహా’తో ప‌ల‌క‌రించి విజయాన్ని అందుకున్నారు సీనియ‌ర్ క‌థానాయ‌కుడు నందమూరి బాలకృష్ణ.