close
Choose your channels

బాల‌య్య ద్వితీయార్థం బిజీ బిజీ

Saturday, March 17, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాల‌య్య ద్వితీయార్థం బిజీ బిజీ

ఈ ఏడాది సంక్రాంతికి ‘జై సింహా’తో ప‌ల‌క‌రించి విజయాన్ని అందుకున్నారు సీనియ‌ర్ క‌థానాయ‌కుడు నందమూరి బాలకృష్ణ.  ప్రస్తుతం ‘యన్.టి.ఆర్’ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారాయ‌న‌. త‌న తండ్రి, మహానటుడు ఎన్టీఆర్ పాత్ర‌లో బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించనున్నారు. ఈ నెల 29న లాంఛనంగా షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు. ఆగ‌స్టు నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని.. ఈ లోపు  తేజ.. వెంకటేష్‌తో చేయబోతున్న సినిమాపై దృష్టి సారిస్తార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లోపు బాలకృష్ణ కూడా.. బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ సినిమాని ప్రారంభించ‌నున్నార‌ట‌.

రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని.. బాలకృష్ణ 58వ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఆరంభించనున్నార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల సమయానికి విడుదల చేయడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బాల‌య్య‌, బోయ‌పాటి కలయికలో ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు ఘనవిజయం సాధించడంతో ఈ హ్యాట్రిక్ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే  ప్రస్తుతం బోయపాటి.. రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా పూర్తైన వెంటనే (ఆగష్టు నుంచి) బాలకృష్ణ సినిమాను పట్టాలెక్కిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే.. ‘జై సింహా’తో విజయాన్ని అందించిన నిర్మాత సి.కళ్యాణ్ నిర్మాణంలో బాలయ్య ఓ సినిమా చేస్తానని ఇప్పటికే మాటిచ్చారు. ఈ చిత్రానికి దర్శకుడిగా పూరి జగన్నాథ్, ఎస్.వి.కృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఈ చిత్రం కూడా ద్వితీయార్ధంలోనే  సెట్స్ పైకి వెళ్ళే సూచనలు ఉన్నాయి. మొత్తానికి.. 2018 ద్వితీయార్ధంలో బాలకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో.. సమాంతరంగా జరిగే షూటింగ్స్‌తో బిజీగా ఉండనున్నారన్న మాట.  

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.