డైరెక్ట‌ర్ ప‌రుశురామ్‌పై కోపంగా ఉన్న నాగ్ ?

డైరెక్ట‌ర్ ప‌రుశురామ్‌పై టాలీవుడ్ అగ క‌థానాయ‌కుల్లో ఒకరైన నాగార్జున కోపంగా ఉన్నారా? అంటే కొంద‌రు మాత్రం అవున‌నే అంటున్నారు. అందుకు కార‌ణం ప‌రుశురామ్ చేసిన ప‌నేన‌ని వారు జ‌వాబిస్తున్నారు. ఇంత‌కు నాగార్జున‌కు కోపం వ‌చ్చేలా ప‌రుశురామ్ ఏం చేశాడు?.. వివ‌రాల్లోకెళ్తే, 2018లో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పరుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో గీత గోవిందం సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా భారీ విజ‌యాన్ని సాధించింది. ఏకంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను 100 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్ సాధించే హీరో క్ల‌బ్‌లో చేర్చిన చిత్ర‌మిది. అయితే వెంట‌నే ప‌రుశురామ్ స్టార్ హీరోలు త‌న‌కు ఛాన్స్ ఇస్తార‌నున్నాడు. నిజంగానే స్టార్ హీరోలు ప‌రుశురామ్‌ను క‌థ చెప్ప‌మ‌ని అన్నారు. ప‌రుశురామ్ చెప్పిన క‌థ వారికి న‌చ్చ‌లేదు. అటు మెగా క్యాంప్ హీరోలు, అప్ప‌ట్లో మ‌హేశ్ ప‌రుశురామ్‌ను హోల్డ్‌లో పెట్టేశారు. దీంతో ప‌రుశురామ్ ప‌రిస్థితి అర్థం కాలేదు.

అదే స‌మ‌యంలో ప‌రుశురామ్‌తో సినిమా చేయ‌డానికి అక్కినేని నాగ‌చైత‌న్య ముందుకొచ్చాడు. సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మై ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రిగాయి. అయితే ఈలోపు వంశీ పైడిప‌ల్లితో మ‌హేశ్ చేయాల్సిన సినిమా క‌థ న‌చ్చ‌క ఆగిపోయింది. అప్పుడు ప‌రుశురామ్‌కు మ‌హేశ్ క‌బురెట్టాడు. మ‌హేశ్ పిలిచి సినిమా చేస్తాన‌ని అన‌డంతో ప‌రుశురామ్ వెన‌కా ముందు ఆలోచించ‌కుండా చైత‌న్య సినిమాను త‌ర్వాత చూసుకుందాంలే అనుకుని వెళ్లిపోయాడు. ఇది ఓ ర‌కంగా అనైతికమే అనొచ్చు. ఈ వ్య‌వ‌హారం నాగార్జున చెవిన ప‌డ‌టంతో ఆయ‌న కోపంగా ఉన్నాడ‌ని టాక్‌. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కు వెళుతుందో చూడాలి.

More News

నాలుగు నెల‌ల ముందే చెప్పిన బ‌న్నీ...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 20వ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్యం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

కరోనాతో చనిపోతే.. తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇండియాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అంతేకాదు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకున్న విలన్

కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు ప్రముఖులు తమ వంతుగా సాయం చేయడానికి ముందుకొస్తున్నారు.

గుండె జబ్బుతో బాధపడుతున్న మహిళకు అండగా చిరు

మెగాస్టార్ చిరంజీవి రీల్‌లోనే కాదు.. రియల్‌గా కూడా హీరో అనిపించుకున్న సందర్భాలున్నాయి. ఇందుకు కారణం ఆయనకున్న పెద్ద మనసే. తమకు కష్టం వచ్చింది ఆదుకోండి

టీవీ యాంకర్ శాంతి అనుమానాస్పద మృతి.. ఫోన్ స్వాధీనం!

ప్రముఖ తెలుగు టీవీ యాంకర్‌, సీరియల్‌ నటి శాంతి (విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. నగరంలోని ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఎల్లారెడ్డి గూడెం ఇంజనీర్స్‌ కాలనీలోని