'క్రాక్' కాపీ క‌థ‌నా?

  • IndiaGlitz, [Wednesday,January 29 2020]

ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'క్రాక్‌'. ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణను జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే 8న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈసినిమా ఓ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క‌థ. అయితే ఈ సినిమాకు మూల క‌థ ఓ త‌మిళ సినిమా నుండి తీసుకున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆ సినిమా ఏదో కాదు.. కోలీవుడ్ మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి హీరోగా నటించిన సేతుప‌తి సినిమానే. నిజానికి ఈ సినిమాను తెలుగులో గంటా శ్రీనివాస్ త‌న‌యుడు ర‌వి హీరోగా జ‌య‌దేవ్ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే అదే క‌థ‌ను తెలుగులో మ‌ళ్లీ రీమేక్ చేస్తున్నార‌ని టాక్.

ఇది వ‌ర‌కు త‌మిళంలో విజ‌య్ తెరి సినిమానే తెలుగులో రీమేక్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే గోపీచంద్ మ‌లినేని అలాంటివేమీ లేద‌ని ఆ వార్త‌ల‌ను కొట్టి పారేశారు. మ‌రిప్పుడు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. డాన్‌శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు.

More News

సత్యం చిత్రం మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి!

శ్రీమాతా క్రియేషన్స్ బ్యానర్ పై కె.మహాంతేష్ నిర్మాతగా అశోక్ కడబ దర్శకత్వంలో సంతోష్ బాలరాజు హీరోగా షియాజి షిండే, సుమన్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం సత్యం.

20 నిమిషాల కోసం దాదాపూ రూ.8 కోట్లా?

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ గ‌త ఏడాది ద‌బాంగ్ 3 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఆ సినిమాను ప్ర‌భుదేవా డైరెక్ట్ చేశారు. ఇప్పుడు మూడోసారి ప్ర‌భుదేవాద‌ర్శ‌క‌త్వంలోనే స‌ల్మాన్‌ఖాన్ రాధే

వివేకా హత్యకేసులో షాకింగ్ ట్విస్ట్.. పేర్లు బయటికొచ్చాయ్!!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో మరో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. ఇప్పటికే ఈ కేసు విషయంలో పలువుర్ని పోలీసులు, కోర్టులు విచారించిన

టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు కన్నుమూత

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ రచయిత, సినీ నటుడు జాన్ కొట్టొలీ ఇవాళ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న

రెండో పెళ్లా.. సినిమానా.. ఈ ట్విస్టేంటి మనోజ్!?

టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్.. కొద్ది రోజుల క్రితమే భార్య ప్రణీత రెడ్డి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.