'మహా సముద్రం' స్క్రిప్టుకు శర్వా ఫిదా అయ్యాడా..!

  • IndiaGlitz, [Tuesday,December 31 2019]

ప్రయోగాలు చేయడంలో ముందుండే శర్వానంద్.. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. శర్వా సినిమా ఒప్పుకున్నాడంటే.. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందన్నది కాదనలేని వాస్తవం. స్క్రిప్ట్ బాగుందంటే.. ఏ రిస్క్ అయినా చేస్తాడనే విషయం ఆయన సినిమాలు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అందరి బంధువయా, ప్రస్థానం, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. బోలెడు సినిమాలు. కమర్షియల్ అంటూ కూర్చోకుండా.. తనకు నచ్చిన దారిలో వెళుతున్నాడు.

తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ స్క్రిప్టుతో ప్రేక్షకులకు ముందుకు రానున్నాడు. ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అయిన అజయ్ భూపతితో సినిమా చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ‘మహా సముద్రం’ అనే టైటిల్ ఖరారు అయ్యింది. ఇంతకు ముందు ఈ కథను రవితేజ, నాగ చైతన్యలకు వినిపించారు. అయితే కొన్ని కారణాల వల్ల.. ఇద్దరూ ఈ ప్రాజెక్ట్‌ను వదులుకున్నారు. అయితే అజయ్.. ఈ సారి శర్వాను కలిశాడు. అతను చెప్పిన కథకు శర్వానంద్ ఫిదా అయిపోయాడట. ఇంత మంచి కథతో ఇప్పటి వరకు ఎవరూ రాకపోవడంపై ఒకింత ఆశ్యర్యం కూడా వ్యక్తం చేశాడని ఇండస్ట్రీ టాక్. వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. అంతేగాక.. కథకు సంబంధించి తన ఆలోచనలను కూడా చెప్పాడని సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన క్యాస్ అండ్ క్రూ పై మరింత సమాచారం రానుంది.

More News

'చంద్రబాబు చేస్తున్న పనికి భయమేసింది.. ఎందుకింత కక్ష జగన్..'

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని.. అమరావతి తరలిస్తారన్న ప్రకటన అనంతరం రైతులు, ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే.

చిరంజీవి చిత్రంలో రెజినా ఐటెం సాంగ్ ?

ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో సెకండ్ ఇన్నింగ్సును అద్భుతంగా కొనసాగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్‌లో చేసే సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు.

మహాభారతం గురించి రాజమౌళి తాజా అప్‌డేట్ ఇది...

జక్కన్న.. ఈ పేరుకు అతికినట్టు సరిపోతారు డైరెక్టర్ రాజమౌళి. టాలీవుడ్ చిత్ర శిల్పిగా పేరుతెచ్చుకున్న ఆయన సినిమా తీశారంటే.. శిల్పం చెక్కినట్టు అద్భుతంగా.. సినీ ప్రపంచం తనవైపు చూసేలా తెరకెక్కిస్తారు.

చెర్రీ కోసం మాస్ డైరెక్టర్ నిరీక్షణ..!

అల్లూరి సీతారామరాజు .. ఈ పేరు వినగానే కళ్లముందు కదలాడే నటుడు సూపర్ స్టార్ కృష్ణ. వెండితెరపై సీతారామరాజుకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన నటుడిగా చిరస్థాయి నిలిచిపోయే కీర్తి సంపాదించారు.

ప్రధాని మోదీ నివాసంలో మంటలు.. ఎన్నో అనుమానాలు!!

ప్రధాని మోదీ అధికార నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 7:25 గంటల సమయంలో లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని మోదీ నివాసంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.