సోషల్ మీడియా నుంచి వైదొలిగిన కొరటాల శివ.. కారణం అదేనా!

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సడెన్ గా తాను సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కొరటాల శివ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. అలాంటి దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు అభిమానుల్లో సహజంగానే అనేక సందేహాలు మొదలవుతాయి.

'సోషల్ మీడియా నుంచి నేను వైదొలుగుతున్నాను. సోషల్ మీడియాతో నాకు మంచి మెమొరీస్ ఉన్నప్పటికీ ఇది పక్కకు తప్పుకోవాల్సిన సమయం. మీ అందరితో నేను మీడియా మిత్రుల ద్వారా టచ్ లోనే ఉంటాను. మాట్లాడుతూ ఉంటాను. మీడియం మారుతుందే తప్ప మన మధ్య బంధం కాదు' అని కొరటాల స్వయంగా ప్రకటించారు.

కొరటాల సోషల్ మీడియా నుంచి పక్కకు తప్పుకోవడంపై స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం తన బిజీ షెడ్యూల్ వల్ల సోషల్ మీడియాకు సమయం కేటాయించలేకపోతున్నానని కొరటాల భావిస్తున్నారట.

తన సినిమాలు, వర్క్ గురించి అభిమానులకు తెలియజేయడానికి రెగ్యులర్ మీడియా ఎలాగూ ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా అవసరం లేదని భావిస్తున్నారట. ప్రీప్రొడక్షన్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, తదుపరి చిత్రాలకు సంబంధించిన చర్చలతో కొరటాల బిజీగా మారిపోయారు. అందువల్లే సోషల్ మీడియాకు టైం దొరకడం లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. తర్వాత ఎన్టీఆర్ ని కొరటాల డైరెక్ట్ చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇది రెండవ చిత్రం.

More News

బండ్ల గణేష్ మాట్లాడితే అంతేగా.. ప్రభాస్, రాజమౌళిపై కామెంట్స్!

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఎక్కడున్నా తన ప్రత్యేకత చాటుకుంటాడు.

సప్తగిరి నెక్స్ట్ మూవీ షూటింగ్ పూర్తి.. వైవిధ్యమైన కథతో..

కమెడియన్ సప్తగిరి హీరోగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కమెడియన్ గా సినిమాలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.

'లాల్ సలాం' వెబ్ సిరీస్ రివ్యూ

ఓటిటిలో వెబ్ సిరీస్ ల సందడి బాగా ఉంది. తక్కువ బడ్జెట్ లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి పలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తాజాగా జీ 5 ఓటిటిలో 'లాల్ సలాం'

అండర్ వాటర్ లో ఎమోషనల్ రొమాన్స్..'వసంత కోకిల' టీజర్

తన విలక్షణ నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబీ సింహా.

కేసులో ఊరట .. శ్రీవారిని దర్శించుకున్న నవనీత్ కౌర్

ప్రముఖ నటి, ఎంపీ నవనీత్ కౌర్ తిరుమలలో శ్రీవారికి దర్శించుకున్నారు. ఇటీవల కొంతకాలంగా నవనీత్ కౌర్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.