ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ కథ ఇదేనా!?

  • IndiaGlitz, [Thursday,February 27 2020]

‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. అయితే ఈ కాంబోలో సినిమా ఎలా ఉంటుంది..? కథ ఎలా ఉండబోతోంది..? అనేదానిపై ఇటు టాలీవుడ్‌లో.. అటు సోషల్ మీడియా.. మరీ ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగుచూసింది.

అదేమిటంటే.. ఈ సినిమా మొత్తం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో కొనసాగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో ప్రభాస్ సూపర్ హీరోలా కనిపిస్తాడని సమాచారం. సూపర్ నేచురల్ పవర్స్ వుండే హీరోలా ఆయన పాత్ర ఉంటుందని వార్తలు గుప్పుమంటున్నాయ్. ఆయన లుక్ .. బాడీ లాంగ్వేజ్ ‘క్రిష్’ చిత్రంలో హృతిక్ రోషన్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంటుందట. వాస్తవానికి సైన్స్ ఫిక్షన్‌లో సినిమా చేయాలని అప్పుడెప్పుడో ఓ ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే ఈ కథ ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నారట. దీంతో రకరకాలుగా కథ విషయమై ఇలా వార్తలు వచ్చేస్తున్నాయ్.

ఇదిలా ఉంటే.. ప్రభాస్‌కు ఎంతసేపూ ఫ్యామిలీ రిలేటెడ్, లవ్, భారీ బడ్జెట్ హిస్టారికల్ సినిమాలు తప్ప వేరేవి చేయడానికి పూనుకోడు. అయితే ఒకవేళ ఇది నిజంగానే సైన్స్ ఫ్రిక్షన్ అయితే అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారట. మరోవైపు సినిమాకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఇస్తారేమోనని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతతో వున్నారు. మరి ఫైనల్‌గా ప్రభాస్-నాగ్‌ అశ్విన్‌లు ఎలాంటి కథతో థియేటర్లలోకి వస్తారే వేచి చూడాల్సిందే మరి.

More News

మార్చి 2 నుండి కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జవాల్కర్ ల చిత్రం షూటింగ్ ప్రారంభం

త‌న‌దైన శైలిలో రాజా వారి రాణి గారు చిత్రంలో న‌టించి మెప్పించిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా త‌న రెండ‌వ చిత్రం ఎలైట్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో

2024 కల్లా పవన్ టార్గెట్ రూ. 500 కోట్లు..!

అవును మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ. 500 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

‘పింక్’ రీమేక్ : ట్రెండ్ సెట్ చేస్తున్న థమన్!

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ‘పింక్’ రీమేక్ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నెల 29 న వైజాగ్ లో 'భీష్మ'  విజయోత్సవ వేడుక

ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన 'భీష్మ' మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది.

చిరంజీవి యువత నుంచి బండ్రెడ్డు ఔట్

ఇంటి దొంగలను పనిపట్టే పనిలో జనసేన సిద్ధమవుతోందని.. పార్టీకి వ్యతిరేకంగా కార్యకలపాలు సాగించినా లీగల్‌ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని