శేఖర్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్-2 'ఇష్క్ ఈజ్ రిస్క్ ' మొదలైంది!!

  • IndiaGlitz, [Saturday,June 08 2019]

'ఈ 2మనసులు' చిత్రంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన ప్రముఖ వ్యాపారవేత్త ఎస్.చంద్రశేఖర్.. ఆ చిత్రం నిర్మాణంలో వుండగానే, మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. జెయస్సార్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో.. శేఖర్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు ఇష్క్ is రిస్క్.

రవిచంద్ర, యుగా యుగేష్, సాయి శ్రీవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చితానికి రాజ్ కింగ్ దర్శకుడు. జీవా, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, నల్ల వేణు, బండ రఘు, మాధవి, జబర్దస్త్ పవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్, మాదాపూర్ లోని డీజీపీ గెస్ట్ హౌస్ లో మొదలై ప్రస్తుతం మణికొండలోని మన స్టూడియోలో షూటింగ్ జరుపుకొంటోంది.

చిత్ర నిర్మాత ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 'హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందుతున్న లవ్ ఎంటర్ టైనర్ ఇష్క్ ఈజ్ రిస్క్. మంచి టీమ్ కుదిరింది. మంచి ఔట్ పుట్ వస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

దర్శకుడు రాజ్ కింగ్ మాట్లాడుతూ..దర్శకుడిగా ఇది నా రెండో చిత్రం. 'ఇష్క్ ఈజ్ రిస్క్' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన మా నిర్మాత ఎస్.చంద్రశేఖర్ గారికి థాంక్స్చె
ప్పుకుంటున్నాను అన్నారు.

More News

కొత్త మంత్రులకు ఊహించని శాఖలు కేటాయించిన సీఎం జగన్!

ఏపీ కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 25 మందిలో ఐదుగురికి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శాఖలు ఫిక్స్ చేసేశారు.

సచివాలయంలోకి అడుగుపెట్టిన జగన్.. వరాలే వరాలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారి సచివాలయంలోకి అడుగుపెట్టారు.

వైఎస్ జగన్ టీమ్ ఇదే.. మంత్రులుగా 25 మంది ప్రమాణం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన మంత్రిమండలి కొలువు దీరింది.

జగన్ టీమ్ ప్రమాణం రోజే.. పవన్ కల్యాణ్‌కు ఊహించని షాక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి టీమ్‌లోని 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ట్రైలర్ లాంచ్

స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న చిత్రం `ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ`.