జగన్ టీమ్ ప్రమాణం రోజే.. పవన్ కల్యాణ్కు ఊహించని షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి టీమ్లోని 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం 11:49 గంటలకు ప్రారంభమైన ఈ ప్రమాణ స్వీకారోత్సవం 12:45 గంటలకు ముగిసింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.జగన్ టీమ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జనసేన కీలకనేత, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఊహించని షాక్ తగిలినట్లైంది. తాను
వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను త్వరగా ఆమోదించాలని అధినేత పవన్ను కోరారు. కాగా.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన తరపున పోటీ చేసిన రావెల కిషోర్ ఓటమిపాలయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి మేకతోటి సుచరిత ఘన విజయం సాధించి.. జగన్ కేబినెట్లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.