తమ్ముడి తర్వాత అన్నతో

  • IndiaGlitz, [Tuesday,July 25 2017]

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌మిళంలో కూడా 'ధీర‌న్ అధిగారం ఒండ్రు' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హీరో కార్తీ ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ త‌మిళంలో కూడా విడుద‌ల‌వుతుంది. ఈ రెండు సినిమాలతో ర‌కుల్‌కు త‌మిళంలో మంచి క్రేజ్ వ‌చ్చింది. ఇప్పుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ త‌న త‌దుప‌రి చిత్రంలో ర‌కుల్‌నే హీరోయిన్‌గా తీసుకోబోతున్నాడు.

ఈ సినిమా కాకుండా సెల్వ‌రాఘ‌వ‌న్‌, సూర్య కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కూడా ర‌కుల్‌నే హీరోయిన్‌గా తీసుకుంటార‌ట‌. సూర్య ప్ర‌స్తుతం తానా సెంద కూట్ట‌మ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే సెల్వ‌రాఘ‌వ‌న్ సినిమా మొద‌ల‌వుతుంది. మ‌రో ప‌క్క ఇరుదు సుట్రు ద‌ర్శ‌కురాలు సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో సూర్య మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు.

More News

'డేర్' ఆడియో ఆవిష్కరణ

ప్రవీణ క్రియేషన్స్ పతాకంపై ఎస్.కరణ్ రెడ్డి సమర్పణలో ఎస్.రామారావు నిర్మిస్తోన్న చిత్రం 'డేర్'.

వివాదాస్పద సినిమాకు లైన్ క్లియర్...

కాంటెంపరరీ సమస్యలపై సినిమాలు తీసే దర్శకుడు మధు బండార్కర్ దర్శకత్వంలో రానున్న సినిమా `ఇందు సర్కార్`. అత్యవసర పరిస్థితి సమయంలో ఇండియాలో నెలకొన్న నిజ పరిస్థితులను ఈ సినిమా చూపించబోతున్నారు.

డాక్టరైన తమన్నా..

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు డాక్టర్ గా మారింది.శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తమన్నా సినిమాలతో బిజీగా మారిపోయి, చదువును పక్కన పెట్టేసింది.

రామ్ చరణ్ సినిమాకు ఇన్ స్పిరేషన్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రంగస్థలం 1985'.

ముస్తాబవుతున్న మేడమీద అబ్బాయి

కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి.