చిరుతో ముచ్చ‌ట‌గా మూడోసారి

  • IndiaGlitz, [Saturday,June 16 2018]

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ప‌దేళ్ళ గ్యాప్ త‌రువాత హీరోగా న‌టించిన చిత్రం ఖైదీ నంబ‌ర్ 150. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం గ‌తేడాది సంక్రాంతికి విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రంతోనే మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా అవ‌తార‌మెత్తారు.

ఆ సినిమా అందించిన ఉత్సాహంతో.. ప్ర‌స్తుతం చిరంజీవి తదుప‌రి చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డిని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు చ‌ర‌ణ్. దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చారిత్రాత్మ‌క చిత్రం వ‌చ్చే ఏడాది వేస‌వికి సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా త‌రువాత చిరు న‌టించే సినిమాకి కూడా చ‌ర‌ణ్ ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం.

కాస్త వివ‌రాల్లోకి వెళితే.. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల‌ శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరు ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఆ సంస్థ‌తో పాటు చ‌ర‌ణ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోనున్నార‌ని తెలుస్తోంది. అదేగ‌నుక జ‌రిగితే.. వ‌రుస‌గా చిరుతోనే మూడు సినిమాలు చేసిన నిర్మాత‌గా చ‌ర‌ణ్ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటారు.

More News

షూటింగ్ పూర్తి చేసుకున్న మల్టీస్టారర్ చిత్రం 'వీర భోగ వసంత రాయలు'

నారా రోహిత్‌, శ్రీయా శర‌ణ్‌, సుధీర్ బాబు, శ్రీవిష్ణు కాంబినేష‌న్ లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం వీర భోగ వసంత రాయలు.

రాజ్‌త‌రుణ్ 'ల‌వ‌ర్' షూటింగ్ పూర్తి.

తొలి చిత్రం 'ఊయ్యాల జంపాల‌' తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్.

మెగా హీరో వెర్స‌స్ మెగా హీరో

ఒకే రోజున లేదా ఒక రోజు గ్యాప్‌లో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్ద‌రు హీరోల సినిమాలు రిలీజ‌వ‌డం అతి త‌క్కువ సంద‌ర్భాల్లోనే జ‌రుగుతుంది.

డ‌బ్బింగ్ చెబుతున్న నాగ‌చైత‌న్య‌

ప్రేమ‌మ్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగచైతన్య, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'సవ్యసాచి'.

సమ్మోహనంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం..

సుధీర్‌బాబు,  అదితిరావు హైదరీ జంట గా  శ్రీదేవి మూవీస్ పతాకం ఫై   ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో