close
Choose your channels

చిరుతో ముచ్చ‌ట‌గా మూడోసారి

Saturday, June 16, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరుతో ముచ్చ‌ట‌గా మూడోసారి

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ప‌దేళ్ళ గ్యాప్ త‌రువాత హీరోగా న‌టించిన చిత్రం ఖైదీ నంబ‌ర్ 150. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం గ‌తేడాది సంక్రాంతికి విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రంతోనే మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా అవ‌తార‌మెత్తారు.

ఆ సినిమా అందించిన ఉత్సాహంతో.. ప్ర‌స్తుతం చిరంజీవి తదుప‌రి చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డిని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు చ‌ర‌ణ్. దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చారిత్రాత్మ‌క చిత్రం వ‌చ్చే ఏడాది వేస‌వికి సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా త‌రువాత చిరు న‌టించే సినిమాకి కూడా చ‌ర‌ణ్ ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం.

కాస్త వివ‌రాల్లోకి వెళితే.. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల‌ శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరు ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఆ సంస్థ‌తో పాటు చ‌ర‌ణ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోనున్నార‌ని తెలుస్తోంది. అదేగ‌నుక జ‌రిగితే.. వ‌రుస‌గా చిరుతోనే మూడు సినిమాలు చేసిన నిర్మాత‌గా చ‌ర‌ణ్ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.