తాప్సీ స‌హా బాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై ఐటీ దాడులు

  • IndiaGlitz, [Wednesday,March 03 2021]

బాలీవుడ్ సెల‌బ్రిటీస్ అయిన హీరోయిన్ తాప్సీ, ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత‌లు అనురాగ్ క‌శ్య‌ప్‌, వికాస్ భ‌ల్‌పై ఐటీశాఖ వారు దాడులు చేశారు. ముంబైలో వీరి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారుల సోదాలు కొన‌సాగుతున్నాయి. ప‌న్ను ఎగ‌వేత ఆరోప‌ణ‌ల‌తో ఐటీ శాఖ వీరి ఆస్థుల‌ను సోదా చేస్తున్న‌ట్లు స‌మాచారం. దాదాపు 22 ప్రాంతాల్లో ఈ దాడులు జ‌రుగుతున్నాయి. వికాస్‌భ‌ల్‌కి చెందిన ఫాంట‌మ్ ఫిలింస్ కార్యాల‌యంలోనూ ఈ దాడులు కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం. వీరితో పాటు రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఈఓ శిభాషిస్ స‌ర్కార్‌, ఎక్సైడ్ సీఈఓ అప్స‌ర్ జైదీ, క్వాన్ సీఈఓ విజ‌య్‌సుబ్ర‌హ్మ‌ణ్యంల‌కు సంబంధించిన ఆస్థుల‌పై కూడా ఐటీ సోదాలు జ‌రుగుతున్నాయి. ఈ దాడులు బాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ద‌క్షిణాదిన సినీ హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన తాప్సీ ప‌న్ను ఓ బేబీ..నామ్ ష‌బానా చిత్రాల నుంచి బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. ఇటు ద‌క్షిణాది, అటు ఉత్త‌రాదిన ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంది తాప్సీ. అలాగే అనురాగ్ క‌శ్య‌ప్ హిందీ సినిమాల‌తో పాటు తమిళ చిత్రాల్లో న‌టిస్తున్నారు.

More News

గోవా బ్యూటీ ఇలియానా కొత్త ప్రియుడు..!

గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న ‘విరాట‌ప‌ర్వం’ డిజిట‌ల్ హ‌క్కులు

నక్సలైట్.. రాజకీయ నాయకుడు రవన్న పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తోన్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. రానా జోడీగా సాయిప‌ల్ల‌వి న‌టిస్తోన్న

ప‌వ‌న్ 27...మ‌రో డైరెక్ట‌ర్ కూడా జాయిన‌య్యాడు..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’(వినిపిస్తోన్న టైటిల్).

పార్వతీశం, శ్రీలక్ష్మి జంటగా ఏ1 మహేంద్ర క్రియేషన్స్ సినిమా 'సావిత్రి w/o సత్యమూర్తి' ప్రారంభం

'కేరింత' ఫేమ్ పార్వతీశం కథానాయకుడిగా ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న సినిమా 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'.

కరోనా ఎఫెక్ట్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామోజీ

కరోనా మహమ్మారి ఎఫెక్ట్ ప్రపంచంపై అంతా ఇంతా కాదు. చాలా వరకూ సంస్థలన్నీ కుదేలైపోయాయి.