జై ల‌వ కుశ‌లో పాత్ర తీరులు ఇవీ..

  • IndiaGlitz, [Tuesday,September 19 2017]

జై ల‌వ కుశ చిత్రంలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల‌ను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూడు పాత్ర‌ల గురించి ఆయ‌న క్లుప్తంగా ఇలా చెప్పుకొచ్చారు. జై పాత్రని విల‌న్ అనుకుంటే.. ల‌వ‌కుమార్ పాత్ర హీరోగా అనుకోవ‌చ్చు. ఇక కుశ క్యారెక్ట‌ర్‌కి కామెడీ స్కోప్ ఉంటుంది కాబ‌ట్టి క‌మెడీయ‌న్ అనుకోవాలి అని చెప్పారు.

అంటే.. సినిమాలో హీరో, విల‌న్‌, క‌మెడీయ‌న్ అన్నీ ఎన్టీఆర్‌నే అనుకోవాల‌న్న‌మాట‌. హావ‌భావాల‌ను ప‌లికించ‌డంలో తార‌క్‌కి తిరుగులేదు కాబ‌ట్టి ఈ మూడు పాత్ర‌ల‌ను త‌న‌దైన శైలిలో అద‌ర‌గొట్టి ఉంటార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక హీరోయిన్లుగా న‌టిస్తున్న వారిలో రాశీ ఖ‌న్నాని ల‌వ పాత్ర ప్రేమిస్తే.. జై, కుశ పాత్ర‌లు రెండూ నివేదా థామ‌స్ పాత్ర‌ని ఇష్ట‌ప‌డ‌తాయి. ఆ నేప‌థ్యంలో ఓ చిన్న సంఘ‌ర్ష‌ణ కూడా ఉంటుంద‌ని టాక్‌. మొత్త‌మ్మీద ఈ 5 క్యారెక్ట‌ర్‌ల చుట్టూనే జైల‌వ‌కుశ స‌బ్జెక్ట్ తిరుగుతుంద‌న్న‌మాట‌. ఈ నెల 21న విడుద‌ల కానున్న జై ల‌వ కుశ చిత్రాన్ని క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌గా.. కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

More News

'గులాబీ మేడ' ఆడియో ఆవిష్కరణ

అల్లు వంశీ,అక్షర జంటగా ఎల్.వి.క్రియేటివ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై బొండా వెంకటస్వామి నాయుడు దర్శకత్వంలో

ఆస్ట్రేలియా లో ప్రారంభమైన 'ప్రాజెక్ట్ సి 420'

ఫిలిమ్ అండ్ సి పతాకం పై చైతన్య,దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా మహేష్ దర్శకత్వంలో

'అక్కినేని ఆలోచనలు' పుస్తక అనువాదాల ఆవిష్కరణోత్సవం

మహానటులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత,

రకుల్ కి ఆ రోజు ప్రత్యేకం

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లో ఒకరిగా పేరు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్

32 ఏళ్లు పూర్తిచేసుకున్న చిరంజీవి 'అడవిదొంగ'

మహానటుడు ఎన్టీఆర్ ని తొలి సారిగా డైరెక్ట్ చేస్తూ 'అడవి రాముడు'ని తెరకెక్కించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు.