సాగర్‌లో జానా పోటీ.. టీఆర్ఎస్, బీజేపీ గుండెల్లో గుబులు..!

  • IndiaGlitz, [Saturday,February 13 2021]

కాంగ్రెస్ పార్టీ తరుఫున నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తాను పోటీ చేస్తున్నానని మాజీ మంత్రి జానారెడ్డి ప్రకటించారు. అటు నియోజకవర్గ ప్రజల కోరికతో పాటు పార్టీ అభిప్రాయం, ప్రజాస్వామ్యాన్ని, నైతిక విలువలను కాపాడాలని తాను బరిలో దిగుతున్నట్టు వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకున్న భ్రమలు క్రమక్రమంగా తొలిగిపోతున్నాయని.. జీహెచ్ఎంసీ ఫలితాలను ఉదాహరణగా పేర్కొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో తమ పార్టీ నేతలను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై సైతం జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఏం చేసిందంటూ సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారని.. అసలు కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి వల్లే రాష్ట్రానికి ఇప్పుడు ఇంత ఆదాయం వస్తోందని జానారెడ్డి తెలిపారు.

ఇకపోతే.. కాంగ్రెస్ పార్టీ చాలా ఇంటెలిజెంట్‌గా జానారెడ్డిని నాగార్జునసాగర్ బరిలో నిలిపింది. ఆయనకున్న అనుభవం కానీ.. నియోజకవర్గంపై ఆయనకున్న పట్టు కానీ వేరొక నేతకు లేదంటే అతిశయోక్తి కాదు. అత్యధిక సార్లు విజయం సాధించి తన సత్తా ఏంటో చూపించారు. అత్యంత సౌమ్యుడు కావడంతో ఆయనను నియోజకవర్గ ప్రజలు ఎంతగానో అభిమానిస్తారు. ప్రతిపక్ష పార్టీలు సైతం జానారెడ్డిని మాట అనేందుకు సాహసించరు. చివరకు సీఎం కేసీఆర్ కూడా ఆయనను మర్యాదపూర్వకంగానే సంబోధిస్తారు. అలాంటి జానారెడ్డి నాగార్జున సాగర్‌ బరిలో దిగుతున్నారంటేనే టీఆర్ఎస్, బీజేపీలు ఒకింత భయపడుతున్నాయి. ఆయనకు ధీటైన నాయకుడిని బరిలో నిలపడం కోసం కసరత్తు చేస్తున్నాయి.

ఒకప్పుడు దేశాన్నేలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనే ఆదరణ లేకుండా పోయింది. ఒకరకంగా నాయకత్వ లేమి తెలంగాణలో స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు పుంజుకోకుంటే ఇక మీదట కష్టమే. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే అధిష్టానం జానారెడ్డిని బరిలోకి దింపినట్టు తెలుస్తోంది. ఇక్కడ జానారెడ్డి గెలిస్తే టీఆర్ఎస్‌ పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఇప్పటికే అటు దుబ్బాక.. ఇటు జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బే తగిలింది. ఇప్పుడు సాగర్‌లో కూడా దెబ్బపడితే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉంది.

More News

పవన్ స్ఫూర్తితో అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్ఫూర్తితో అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఐదుగురు నిర్మాతలు రూ.54.51 లక్షల విరాళాన్ని అందజేశారు.

కోలీవుడ్‌లో ఛాన్స్ దక్కించుకున్న శివాత్మిక రాజశేఖర్

శివాత్మిక రాజశేఖర్.. ఆ మధ్య విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘దొరసాని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

‘జాతిరత్నాలు’: లైఫ్‌ అండ్‌ డెత్‌ సమస్యకు కామెడీని మిక్స్ చేశారు

న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి టైటిల్ రోల్స్ పోషిస్తున్న చిత్రం 'జాతిర‌త్నాలు'. ఈ సినిమాలో ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది.

ఇల్లందు జేకే మైన్స్‌ను సందర్శించిన కొరటాల.. 7 నుంచి షూటింగ్

సక్సెస్‌ఫుల్ దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

టీటీడీని ధారాదత్తం చేసేందుకు కుట్ర: చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం విషయమై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతామోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.