వైసీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైంకు జనసేన ఫిర్యాదు

  • IndiaGlitz, [Friday,August 23 2019]

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బర్త్ డే గిఫ్ట్‌లు ఇస్తున్నారంటూ వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నామని జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ తెలిపారు. పార్టీ మీద ఎవరు ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడినా చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. పవన్ పైనా వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీ వేదికగా ప్రచారం చేస్తున్న అసత్య ప్రచారంపై శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకి జనసేన పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మాటిచ్చారన్నారు.

జనసేన పార్టీ అధ్యక్షుల వారి వ్యక్తిగత రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ మాట్లాడుతూ.. కొందరు ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ మీద, జనసేన పార్టీ మీద అబాండాలు వేస్తున్నారు. అధ్యక్షుల వారి సూచన మేరకు కొంత సంయమనం పాటించాం. అయితే ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇప్పుడు స్థాయిని దాటిపోతున్నాయి. వారు ఎలాంటి ఊహల్లో ఉన్నారో దాన్ని ప్రచారం చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల మధ్యకి వెళ్తున్న పార్టీని మొగ్గలోనే తుంచేయాలన్న దురుద్దేశంతో బర్త్ డే సందర్భంగా రూ. 2 వేల కోట్లు బ్లాక్ మనీని వైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా అధికారిక పేజీ ద్వారా చేస్తున్న ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నాం. ఇక మీదట జనసేన పార్టీ మీద ఇలాంటి దుష్ర్పచారాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పారు.

More News

ముంపుకు గురైన లంక గ్రామాలను సర్కార్ ఆదుకోవాలి!

వరద ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు, పనులు లేక ఇబ్బందిపడుతున్న వ్యవసాయ కూలీలకు ఆరు నెలలపాటు నష్టపరిహారం చెల్లించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు,

విజయసాయి.. రుజువు చేస్తే సర్కార్‌కే రాసిస్తా!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సీజన్ అయిపోయింది.. ప్రభుత్వం కూడా ఏర్పాటైందనుకుంటే.. అస్సలు ఎన్నికల సీజన్ ముందున్న కాక ఏ మాత్రం తగ్గలేదు.

తిరుమలలో అన్యమత ప్రచారం.. వైఎస్ జీవో చూడు జగన్!

తిరుమల ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

కోడెలే కాదు చంద్రబాబు కూడా సర్కార్‌ సొమ్ము దాచిపెట్టారు!

గత మూడ్రోజులుగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్‌ను సొంత పనులకు వాడుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం విదితమే.

బన్నీ అరుదైన గుర్తింపు

ఉత్త‌రాది, ద‌క్షిణాది సినిమాలు, స్టార్‌హీరోల మ‌ధ్యనున్న అంత‌రాలు త‌గ్గుతున్నాయి. `బాహుబ‌లి`, `సాహో` వంటి మ‌న తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్ భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతున్నాయి.