మూడు రాజధానుల అంశంపై జనసేన కీలక నిర్ణయం..

మూడు రాజధానుల అంశంపై జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు అండగా నిలవాలని నిర్ణయించారు. నేడు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమవేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. సమావేశానంతరం మీడియాకు ఆ పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. న్యాయపరంగా కూడా అమరావతికి మద్దతుగా పోరాడాలని జనసేన తీర్మానించింది. గతంలోనే తమ పార్టీ తదుపరి ప్రభుత్వం ఏది వచ్చినా రైతులకు అన్యాయం జరగకుండా చట్టం చేయాలని సూచించిందని పవన్ తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయం ఏమాత్రం సబబు కాదని పవన్ అభిప్రాయపడ్డారు.

జగన్ మాట మార్చారు..

అమరావతిలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని ఎన్నికలప్పుడు చెప్పిన జగన్ రెడ్డి.. ఇప్పుడు మాట మార్చి ప్రజలను మోసం చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాలను పూర్తి చేయకుండా మధ్యలోనే నిలిపివేయడం టీడీపీ చేసిన అతిపెద్ద తప్పిదమని పవన్ అభిప్రాయపడ్డారు. నేడు జరుగుతున్న పరిణామాలకు టీడీపీయే బాధ్యత వహించాలన్నారు. సీఎం జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని పవన్ పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ రాజకీయాలకు రాజధాని రైతులను బలి చేయవద్దని ఈ సందర్భంగా సూచించారు.

More News

బ్రేకింగ్: అమిత్ షాకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కరోనా బారిన పడగా..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. తెలంగాణ నేతలతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోడంతో..

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. నేడు దాదాపు 55 వేల కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఐదు రోజులుగా 50 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి.

‘ఆకాశ‌వాణి’ యూనిట్‌కు రానా సపోర్ట్

ఇప్పుడంటే వినోద మాధ్య‌మాలు ఎక్కువైయ్యాయి కానీ.. ఒక‌ప్పుడు అంద‌రికీ ప్ర‌ధాన వినోద సాధనం రేడియోనే.

మోహన్‌బాబు కుటుంబ సభ్యులను హెచ్చరించిన దుండగుల అరెస్ట్

ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు ఫాం హౌస్ వద్ద నిన్న రాత్రి కలకలం రేగింది. జల్పల్లిలోని ఆయన ఫాంహౌస్‌లోకి గత రాత్రి ఓ కారు ఆయన ఇంట్లోకి దూసుకెళ్లింది.