రాధా రాజీనామా.. జనసేనలో ఫుల్ జోష్!

  • IndiaGlitz, [Monday,January 21 2019]

వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేయడంతో విజయవాడ జనసేనలో ఫుల్ జోష్ వచ్చింది. ఆయన ఎలాగో టీడీపీలోకి వెళ్లే చాన్స్ లేదు గనుక.. మిగిలింది ఒకే ఒక్క జనసేన మాత్రమేనని కచ్చితంగా పవన్ సమక్షంలో పార్టీలో చేరతారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. జనసేనికులకు సంబంధించిన కొన్ని ఫేస్‌‌బుక్, వాట్సాప్, ట్వి్ట్టర్ ఖాతాల్లో సైతం రాధా ఫొటో పెట్టుకుని ఈ రూపంలో ఆనందించారు. పైగా రాధాది కాపు సామాజిక వర్గం గనుక.. ఇది కూడా మనకు కలిసొస్తుందని జనసేన ముఖ్యనేతలు భావిస్తున్నారు.

నవ్వుతూ సమాధానం..!
రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన రాధాను.. మీరు జనసేనలో చేరుతున్నారా..? అని అడగ్గా నవ్వుతూ సమాధానం చెప్పుకుండా వెళ్లిపోయారు. మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావించగా మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు.. అవసరమైతే వాళ్లే వస్తారు కదా అని అంటూ దాటవేసే ప్రయత్నం చేశారాయన. దీంతో రాధా చేరిక జనసేనలోనేనని మరింత క్లారిటీ వచ్చినట్లైంది. అయితే రాధా చేరితే ఒక్క జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వంగవీటి అభిమానులు, అనుచరులు, ఆయన సామాజిక వర్గం జనసేనకు అండగా ఉంటుందని జనసైన్యం భావిస్తోందని సమాచారం. ఒకవేళ రాధా పార్టీలోకి వస్తే ఆయన కోరుకున్న స్థానం నుంచే బరిలోకి దింపాలని జనసేనాని భావిస్తున్నారట.

రెండ్రోజుల్లో తేల్చేస్తా..!
అయితే రాధా మాత్రం ఇంకా అనుచరులు, అభిమానులతో ఇంకా చర్చించలేదు.. వారి అభిప్రాయం తెలుసుకుని తదుపరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానన్న మాట వాస్తవం కాదని.. కచ్చితంగా కొనసాగి కేడర్‌‌ను కాపాడుకుంటానని రాధా స్పష్టం చేశారు. అయితే ఈ రెండ్రోజుల్లో రాధా ఏం చేయబోతున్నారు..? ఏ పార్టీ కండువా కప్పుకుంటారు..? పవన్ గూటికి చేరతారా..? కుటుంబ శత్రువున్న టీడీపీ గూటికి చేరతారా..? అనే విషయాలు విజయవాడ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. రెండ్రోజులు ఆగితే కాని రాధా ఏ గూటికి చేరతారో క్లారిటీ వచ్చేలా లేదు.

More News

'మిస్ట‌ర్ మ‌జ్ను' సెన్సార్ పూర్తి

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌

ఆ వార్త‌లు అవాస్త‌వం... ప్రాజెక్ట్ క‌న్‌ఫ‌ర్మ్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా సినిమా ను తెర‌కెక్కించ‌నున్నాయి.

జనసేనలోకి ఆకుల.. ఎక్కడ్నుంచైనా పోటీకీ ‘సై’

బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆకుల దంపతులు పార్టీలో చేరారు.

న‌లుగురు హీరోయిన్స్‌తో రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రారంభం

బ్లాక్ అండ్ వైట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్షన్ నెం.1గా కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది.

చిరంజీవి క్లాప్ తో ప్రారంభమయిన సాయి ధరమ్ తేజ్ తమ్ముడి చిత్రం

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్  రామనాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది..