రెండో జాబితా విడుదల.. పవన్ పోటీస్థానం పై సస్పెన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన రెండో అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు. కాగా.. ఈ జాబితాను కూడా మొదటి జాబితాలాగే అర్ధరాత్రి 2గంటలకు ప్రకటించారు. మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకు, ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను జనసేనాని ప్రకటించారు. కాగా ఈ జాబితాలో కూడా పవన్ ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనే స్థానంపై క్లారిటీ రాకపోవడం గమనార్హం. అసలు ఆయన ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా..? ప్రజారాజ్యం పార్టీలో చిరు పోటీ చేసినట్లుగా రెండు స్ధానాల్లో పోటీ చేస్తారా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు అభిమానులు.. ఇటు కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది.
జనసేన పార్టీ అభ్యర్ధుల రెండవ జాబితా
32 అసెంబ్లీ స్థానాలు... 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక
సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థి ఖరారు
పార్లమెంట్ అభ్యర్ధులు (ఆంధ్రప్రదేశ్)
అరకు- శ్రీ పంగి రాజారావు
మచిలీపట్నం- శ్రీ బండ్రెడ్డి రాము
రాజంపేట- శ్రీ సయ్యద్ ముకరం చాంద్
శ్రీకాకుళం- శ్రీ మెట్ట రామారావు (ఐ.ఆర్.ఎస్)
పార్లమెంట్ అభ్యర్ధి (తెలంగాణ)
సికింద్రాబాద్- శ్రీ నేమూరి శంకర్గౌడ్
అసెంబ్లీ అభ్యర్ధులు (ఆంధ్రప్రదేశ్)
ఇచ్చాపురం-శ్రీ దాసరి రాజు
పాతపట్నం- శ్రీ గేదెల చైతన్య
అముదాలవలస- శ్రీ రామ్మోహన్
మాడుగుల- శ్రీ జి. సన్యాసినాయుడు
పెందుర్తి- శ్రీ చింతలపూడి వెంకటరామయ్య
చోడవరం- శ్రీ పి.వి.ఎస్.ఎన్ రాజు
అనకాపల్లి- శ్రీ పరుచూరి భాస్కరరావు
కాకినాడ రూరల్- శ్రీ పంతం నానాజీ
రాజానగరం- శ్రీ రాయపురెడ్డి ప్రసాద్(చిన్నా)
రాజమండ్రి అర్బన్- శ్రీ అత్తి సత్యనారాయణ
దెందులూరు- శ్రీ గంటసాల వెంకటలక్ష్మి
నరసాపురం- శ్రీ బొమ్మడి నాయకర్
నిడదవోలు- శ్రీ అటికల రమ్యశ్రీ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.